యాప్నగరం

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు రోహిత్ రెడీ.. కానీ?

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. డిసెంబర్ 11 నిర్వహించనున్న ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పాసయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Samayam Telugu 7 Dec 2020, 12:49 pm
ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో ఉన్న రోహిత్.. డిసెంబర్ 11న ఫిట్‌నెస్ టెస్టును ఎదుర్కొనున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ నుంచి రోహిత్ కోలుకుంటున్నాడని.. డిసెంబర్ 12న ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని సమాచారం. ఆసీస్ చేరుకున్న తర్వాత హిట్ మ్యాన్ 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండే అవకాశం ఉంది.
Samayam Telugu rohit-sharma
Instagram Pic


ఆ తర్వాత మరోవారం పాటు శిక్షణ పొందాక.. మూడో టెస్టులో రోహిత్ బరిలోకి దిగుతాడని భావిస్తున్నారు. జనవరి 7న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఈ టెస్టు ప్రారంభం కానుంది.

డిసెంబర్ 17-21 తేదీల మధ్య జరిగే తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావడం భారత్‌కు ఎంతో ముఖ్యం.

ఐపీఎల్ 2020లో గాయపడిన రోహిత్ శర్మ ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికవ్వలేదు. ముందుగా ప్రకటించిన టెస్టు జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. కానీ గాయపడిన రోహిత్, ఇషాంత్‌లను నిశితంగా గమనిస్తామని బీసీసీఐ ప్రకటించింది.

తర్వాత రోహిత్‌ పేరును టెస్టు జట్టులో చేర్చినా.. తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో అతడు దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లకుండా ఇండియా తిరిగొచ్చాడు. కంకషన్, హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీ బారిన పడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 సిరీస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడు తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండబోడని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.