యాప్నగరం

ఏడేళ్ల తర్వాత జట్టులోకి ఎంపిక చేసి షాకిచ్చారు!

యాషెస్ సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా సెలక్టర్లు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏడేళ్ల విరామం తర్వాత ఓ ఆటగాడికి అవకాశం ఇచ్చారు.

TNN 17 Nov 2017, 4:12 pm
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో తలపడే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్ల తర్వాత టిమ్ పెయిన్‌కు ఆసీస్ మేనేజ్‌మెంట్ పిలుపునిచ్చింది. 32 ఏళ్ల ఈ టాస్మానియా ఆటగాడు చివరిసారిగా 2010లో టెస్టు క్రికెట్ ఆడాడు. ఆ ఏడాది అక్టోబర్లో బెంగళూరులో భారత్‌తో జరిగిన టెస్టులో ఆడిన టిమ్.. తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 23 రన్స్ చేశాడు. రిక్కీ పాంటింగ్ నాయకత్వంలో ఆడిన పెయిన్.. మళ్లీ ఇన్నాళ్లకు జట్టులో సంపాదించాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతడి ఎంపిక పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Samayam Telugu australian cricket team recall wicketkeeper tim paine after seven years
ఏడేళ్ల తర్వాత జట్టులోకి ఎంపిక చేసి షాకిచ్చారు!


వికెట్ కీపర్ అయిన టిమ్ పెయిన్‌కు అనూహ్యంగా జట్టులో చోటిచ్చిన ఆసీస్.. అతడికి దేశవాళీ టోర్నీలో వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించలేదు. షెఫర్‌ఫీల్డ్‌తో జరిగిన మ్యాచ్లో టస్మానియా తరఫున మాథ్యూ వేడ్ కీపర్‌గా వ్యవహరించాడు.

టిమ్‌తోపాటు ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, షాన్ మార్ష్‌ను కూడా ఆసీస్ తొలి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసింది. బ్రాన్‌కాఫ్ట్ పట్ల కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంతో నమ్మకం ఉంచాడు. సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన చాద్ సాయెర్స్‌ ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఆరోస్థానంలో షాన్ మార్ష్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.