సిగ్గుపడండి.. హైదరాబాద్ పరువు తీశారు
భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి జరగాల్సిన విజేత నిర్ణయాత్మక టీ20 మ్యాచ్.. ఔట్ఫీల్డ్ గట్టిపడకపోవడం వల్ల రద్దవడంపై మాజీ కెప్టెన్
TNN 14 Oct 2017, 4:58 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి జరగాల్సిన విజేత నిర్ణయాత్మక టీ20 మ్యాచ్.. ఔట్ఫీల్డ్ గట్టిపడకపోవడం వల్ల రద్దవడంపై మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. రోజంతా చినుకు వర్షం పడకపోయినా.. ఔట్ఫీల్డ్ని తయారుచేయలేకపోవడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తాడు.
మ్యాచ్ మధ్యలో వర్షం పడినా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్లీ మైదానాన్ని మ్యాచ్ కోసం సిద్ధచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇలా వర్షం పడకపోయినా మ్యాచ్ని నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని అజహరుద్దీన్ పెదవి విరిచారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్లో వర్షం పడుతోంది. కనీసం.. మ్యాచ్కి ముందు అధికారులు శ్రద్ధ పెట్టినా సరిపోయేదని.. నిర్ణయాత్మక ఈ మ్యాచ్ రద్దవడంతో బీసీసీఐ ఇక ఉప్పల్కి మ్యాచ్లు కేటాయించడంపై ఆలోచిస్తుందని అజహర్ వివరించాడు. అభిమానులు సైతం ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పరువు తీశారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో హెచ్సీఏ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మ్యాచ్ మధ్యలో వర్షం పడినా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్లీ మైదానాన్ని మ్యాచ్ కోసం సిద్ధచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇలా వర్షం పడకపోయినా మ్యాచ్ని నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని అజహరుద్దీన్ పెదవి విరిచారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్లో వర్షం పడుతోంది. కనీసం.. మ్యాచ్కి ముందు అధికారులు శ్రద్ధ పెట్టినా సరిపోయేదని.. నిర్ణయాత్మక ఈ మ్యాచ్ రద్దవడంతో బీసీసీఐ ఇక ఉప్పల్కి మ్యాచ్లు కేటాయించడంపై ఆలోచిస్తుందని అజహర్ వివరించాడు. అభిమానులు సైతం ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పరువు తీశారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో హెచ్సీఏ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.