ఛత్తోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. 8 వికెట్ల నష్టానికి 133 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. 150 పరుగులకు ఆలౌటయ్యింది. ఎబాదత్ హొస్సేన్ (17)ను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్.. తొమ్మిదో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. కాసేపటికే మెహదీ హసన్ (82 బంతుల్లో 25)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 55.5 ఓవర్లలో 150 రన్స్కు ఆలౌటయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 254 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. లంచ్ సమయానికి 15 ఓవర్లు ఆడిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 20), శుభ్మన్ గిల్ (47 బంతుల్లో 15) క్రీజ్లో ఉన్నారు. దీంతో భారత్ ఆధిక్యం 290 పరుగులకు చేరింది. ఈ రోజంతా టీమిండియా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్ ఆదుకోవడంతో భారత్ 404 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఛతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58) హాఫ్ సెంచరీలు సాధించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ తలో 4 వికెట్లు తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసింది. రెండో రోజు నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. శుక్రవారం ఆట ప్రారంభమైన కాసేపటికే ఎబాదత్ను ఔట్ చేసి ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
20 నెలల తర్వాత టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. బ్యాటింగ్లో 40 పరుగులు చేయడంతోపాటు.. బౌలింగ్లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్కు ఇది 8 టెస్టు కాగా.. 5 వికెట్ల హాల్ సాధించడం మూడోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు భారత్తోపాటు ఆస్ట్రేలియాలో అతడు ఐదు వికెట్ల హాల్ సాధించాడు.
Read More Sports News And Telugu News
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్ ఆదుకోవడంతో భారత్ 404 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఛతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58) హాఫ్ సెంచరీలు సాధించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ తలో 4 వికెట్లు తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసింది. రెండో రోజు నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. శుక్రవారం ఆట ప్రారంభమైన కాసేపటికే ఎబాదత్ను ఔట్ చేసి ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
20 నెలల తర్వాత టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్.. బ్యాటింగ్లో 40 పరుగులు చేయడంతోపాటు.. బౌలింగ్లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్కు ఇది 8 టెస్టు కాగా.. 5 వికెట్ల హాల్ సాధించడం మూడోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు భారత్తోపాటు ఆస్ట్రేలియాలో అతడు ఐదు వికెట్ల హాల్ సాధించాడు.
Read More Sports News And Telugu News