యాప్నగరం

సారీ.. మా వాళ్లు చేసింది తప్పే: బంగ్లా క్రికెట్ బోర్డ్

శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచాక బంగ్లా పెద్ద రచ్చే చేసింది. ఈ గొడవపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Samayam Telugu 18 Mar 2018, 12:59 pm
శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచాక బంగ్లా పెద్ద రచ్చే చేసింది. ఈ గొడవపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ క్రికెటర్లే తప్పు చేశారని... అందుకు క్షమాపణలు చెబతున్నామన్నారు. దీనికి సంబంధించి బీసీబీ శ్రీలంక బోర్డుకు ఓ లేఖ రాసింది. తమ ఆటగాళ్ల దూకుడు, వ్యవహారం శైలి వల్ల విధ్వంసం జరిగింందని... ఇతరుల్ని రెచ్చగొట్టే విధంగా గ్రౌండ్‌లో ప్రవర్తించడాన్ని తమతో పాటూ ఎవరూ సమర్థించరన్నారు. తప్పంతా బంగ్లా క్రికెటర్లదేనని... క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని చెప్పారు. బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనకు తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపింది.
Samayam Telugu bangladesh cricket board apology for during sri lanka match
సారీ.. మా వాళ్లు చేసింది తప్పే: బంగ్లా క్రికెట్ బోర్డ్


శ్రీలంకతో మ్యాచ్ సమయంలో చివరి ఓవర్ జరుగుతుండగా వివాదం మొదలయ్యింది. ఓవర్‌లో బంతి భుజం కంటే ఎక్కువ ఎత్తులో వెళ్లిన అంపైర్ నోబాల్ ఇవ్వలేదని బంగ్లా బ్యాట్స్‌మెన్ అసహనం వ్యక్తం చేశారు. సబ్‌స్ట్యూట్ ప్లేయర్లు శ్రీలంక ఆటగాళ్లతో గొడవకు దిగారు. చివరికి మిగిలిన ఆటగాళ్లు, బంగ్లా టీమ్ మేనేజర్ సర్థిచెప్పడంతో వివాదం సద్ధుమణిగింది. మ్యాచ్ గెలిచాక కూడా బంగ్లా క్రికెటర్లు రెచ్చిపోయారు. లంక ప్లేయర్లను, ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా నాగిని డ్యాన్సులు చేశారు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు కూడా ధ్వంసం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.