యాప్నగరం

బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ అరుదైన ఘనత

గతంలో జయసూర్య భారత్‌పై కరాచీ (ఆసియా కప్ 2008)లో చేసిన 125 పరుగులే ఈ టోర్నీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు.

Samayam Telugu 29 Sep 2018, 11:36 am
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అరుదైన ఘనత సాధించాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన ఫైనల్లో దూకుడుగా ఆడిన దాస్ కేవలం 87 బంతుల్లోనే శతకం సాధించాడు. దీంతో ఆసియా కప్ ఫైనల్లో శతకం బాదిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా నిలిచాడు లిటన్ దాస్. కాగా, అది దాస్ కెరీర్‌లో తొలి వన్డే శతకం కావడం విశేషం. భారత్ మ్యాచ్ నెగ్గినా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం దాస్‌నే వరించింది. ఆ మ్యాచ్‌లో 117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేసి బంగ్లా ఓపెనర్ ఔటయ్యాడు.
Samayam Telugu Liton Das


ఆసియా కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో జయసూర్య భారత్‌పై కరాచీ (ఆసియా కప్ 2008)లో చేసిన 125 పరుగులే ఈ టోర్నీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు. ఓవరాల్‌గా ఆసియా కప్ ఫైనల్లో శతకం బాదిన ఐదో క్రికెటర్‌గా బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్.

కాగా, 2000లో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో పాక్‌తో ఢాకాలో శ్రీలంక ఆటపట్టు శతకం(100) చేశాడు. 2008 ఫైనల్లో భారత్‌పై జయసూర్య (125), 2014 ఫైనల్లో మిర్పూర్‌లో శ్రీలంకపై పాక్ క్రికెటర్ ఫవాద్‌ ఆలమ్‌ (114 నాటౌట్‌), అదే మ్యాచ్‌లో పాక్‌పై లంక ఆటగాడు తిరిమన్నె (101)లు శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.