రేప్ కేసులో నిందితుడిగా పోలీసులతో విచారణ ఎదుర్కొన్న బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ హుస్సేన్ని దక్షిణాఫ్రికాలో ప్రవేశించకుండా ఆ దేశం ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆ దేశానికి పయనమవగా.. రుబెల్ హుస్సేన్కి మాత్రం అనుమతి లభించలేదు. 2014లో రుబెల్ హుస్సేన్ మాజీ ప్రేయసి, నటి నజీన్ అక్తర్ అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. అయితే.. 2015లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢాకా కోర్టు ఈ కేసుని కొట్టివేసింది.
సెప్టెంబరు 28 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభంకానుండగా.. దానికంటే ముందు ఆ దేశంతో బంగ్లాదేశ్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికాకి వెళ్లినా.. రుబెల్ మాత్రం స్వదేశంలోనే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాక్టీస్ మ్యాచ్కి అందుబాటులో ఉండడని.. కానీ.. మొదటి టెస్టు కంటే ముందే జట్టుతో చేరేలా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
‘నాకు తెలిసి గతంలో అతనిపై ఉన్న కేసుని ప్రధాన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకోలేదు. రుబెల్ హుస్సేన్ అనే పేరు చాలా మందికి ఉంటుంది. కాబట్టి.. ఏదైనా పేర్లలో తారుమారు జరిగి ఉంటుంది. ఈ విషయమై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడాం. తొందర్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వెంటనే రుబెల్ని దక్షిణాఫ్రికాకి పంపించే ఏర్పాట్లు చేస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈవో నిజాముద్దీన్ వెల్లడించారు.
సెప్టెంబరు 28 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభంకానుండగా.. దానికంటే ముందు ఆ దేశంతో బంగ్లాదేశ్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెటర్లు దక్షిణాఫ్రికాకి వెళ్లినా.. రుబెల్ మాత్రం స్వదేశంలోనే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాక్టీస్ మ్యాచ్కి అందుబాటులో ఉండడని.. కానీ.. మొదటి టెస్టు కంటే ముందే జట్టుతో చేరేలా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
‘నాకు తెలిసి గతంలో అతనిపై ఉన్న కేసుని ప్రధాన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకోలేదు. రుబెల్ హుస్సేన్ అనే పేరు చాలా మందికి ఉంటుంది. కాబట్టి.. ఏదైనా పేర్లలో తారుమారు జరిగి ఉంటుంది. ఈ విషయమై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడాం. తొందర్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వెంటనే రుబెల్ని దక్షిణాఫ్రికాకి పంపించే ఏర్పాట్లు చేస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈవో నిజాముద్దీన్ వెల్లడించారు.