యాప్నగరం

పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ తాజాగా షాకిచ్చింది. పాక్‌లో కేవలం టీ20లను మాత్రమే ఆడతామని, కొన్ని కారణాల వల్ల టెస్టులను ఆడబోమని తేల్చి చెప్పింది.

Samayam Telugu 13 Jan 2020, 10:43 am
తమదేశంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించాలని భావిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈనెలలో జరిగే పర్యటనలో కేవలం టీ20లను మాత్రమే ఆడతామని, టెస్టు సిరీస్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తాజాగా పాక్‌కు తేల్చిచెప్పింది. దీంతో బంగ్లాదేశ్‌తో ఫుల్ సిరీస్ నిర్వహించాలనే ఆశలు ఆవిరయ్యాయి.
Samayam Telugu bangladesh says no to play tests in pakistan
పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్


Read Also : Australia Series..టీమిండియా సెలెక్షన్ తలనొప్పులు
నిజానికి పాక్‌లో టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సుముఖంగానే ఉంది. మధ్యలో ఎంటరైన ఆదేశ ప్రభుత్వం చిన్న ట్విస్ట్ ఇచ్చింది. భద్రతా కారణాల రిత్యా కేవలం మూడు టీ20ల సిరీస్ మాత్రమే ఆడాలని బీసీబీకి తేల్చిచెప్పింది. దీంతో ఇదే సమాచారాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి చేరవేసిన బోర్డు.. తమ అశక్తతను వ్యక్తం చేసింది. మరోవైపు అంతకుముందు రెండు టెస్టుల సిరీస్‌లో ఒకటెస్టు పాక్‌లో మరొకటి బంగ్లాలో ఆడదామని బీసీబీ ప్రతిపాదించగా.. పాక్ తిరస్కరించింది.

Read Also : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన.. సంజు శాంసన్‌పై వేటు, హార్దిక్‌కి నో ప్లేస్

ఇటీవలే పదేళ్ల తర్వాత పాక్‌లో శ్రీలంక పర్యటించింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్, టెస్టు సిరీస్ ఆడింది. టీ20 సిరీస్‌ను లంక దక్కించుకోగా.. టెస్టు సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు ఇటీవలే పాక్‌లో భద్రత ఫుల్లుగా ఉంటుందని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్ గేల్ అన్నాడు. అక్కడ ఉన్నతస్థాయి భద్రత ప్రమాణాలు పాటిస్తారని ప్రశంసించాడు. తన వ్యాఖ్యలు చేసిన కొంతకాలనికే పాక్‌కు దిమ్మదిరిగేలా బంగ్లా షాకివ్వడం విశేషం.

Read Also : Ishant sharmaకు విరాట్ కోహ్లీ అద్దిరిపోయే రిప్లై

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.