ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా బుధవారం జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టుపై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో ఫైనల్ బెర్తుకి చేరువైన టీమిండియా ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా.. గత శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ గెలుపు బాటని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీలో ఇప్పటికే ఓ సారి భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. వికెట్లు పడగొడుతున్నా.. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న ఫాస్ట్ బౌలర్ జయదేశ్ ఉనద్కత్పై వేటు పడింది. అతని స్థానంలో హైదరాబాద్ ఆటోడ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్కి చోటు దక్కింది. బంగ్లాదేశ్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ని తప్పింది.. అబు హైదర్ని తీసుకుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, చాహల్
భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. వికెట్లు పడగొడుతున్నా.. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న ఫాస్ట్ బౌలర్ జయదేశ్ ఉనద్కత్పై వేటు పడింది. అతని స్థానంలో హైదరాబాద్ ఆటోడ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్కి చోటు దక్కింది. బంగ్లాదేశ్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ని తప్పింది.. అబు హైదర్ని తీసుకుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, చాహల్