యాప్నగరం

Virat Kohli Century కరవుపై బార్మీ ఆర్మీ ట్రోల్స్.. కోహ్లీ ఫ్యాన్స్ కౌంటర్

Virat Kohli చివరిగా సెంచరీ నమోదు చేసి ఈరోజుకి సరిగ్గా 1000 రోజులైందట. ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిన బార్మీ ఆర్మీ టీమిండియా అభిమానుల్ని రెచ్చగొట్టింది. దాంతో?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 19 Aug 2022, 6:54 pm

ప్రధానాంశాలు:

  • విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన బార్మీ ఆర్మీ
  • రివర్స్‌లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కౌంటర్
  • ఆసియా కప్‌ కోసం ప్రిపేర్ అవుతున్న కోహ్లీ
  • యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి టోర్నీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Barmy Army Trolls Virat Kohli (Pic: Getty Images)
విరాట్ కోహ్లీ (Pic: Getty Images)
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని మరోసారి ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ (Barmy Army) ట్రోల్ చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేసి ఈరోజుకి సరిగ్గా 1000 రోజులైందని టీమిండియా (Team India) అభిమానుల్ని బార్మీ ఆర్మీ తొలుత రెచ్చగొట్టింది. 2019, నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ చివరిగా సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఈ భారత మాజీ కెప్టెన్ ఏ ఫార్మాట్‌లోనూ 100 పరుగుల మార్క్‌ని ఈరోజు వరకూ అందుకోలేకపోయాడు.
ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో మరీ ఘోరంగా విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. టెస్టు, వన్డేలు, టీ20 సిరీస్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. దాంతో కోహ్లీ కొన్ని రోజులు ఆటకి దూరంగా ఉండి రెస్ట్ తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించారు. వారి సూచనల మేరకు వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకి విరాట్ కోహ్లీ దూరంగా ఉండిపోయాడు. ఇక యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకూ ఆసియా కప్ జరగనుండగా.. ఈ టోర్నీ కోసం మళ్లీ జట్టులోకి విరాట్ కోహ్లీని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు.


ఆసియా కప్‌కి సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీని బార్మీ ఆర్మీ ఇలా ట్రోల్ చేయడంతో టీమిండియా అభిమానులు రివర్స్‌లో కౌంటరిస్తున్నారు. భారత్ గడ్డపై ఇంగ్లాండ్ టీమ్ సిరీస్‌ గెలిచి ఈరోజుకి సరిగ్గా 3532 రోజులైందని సెటైర్లు వేస్తున్నారు. దాంతో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. భారత్ జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచి ఈరోజుకి 3343 రోజులైందని మళ్లీ రెచ్చగొట్టారు. దాంతో.. భారత్ అభిమానులు ఇంగ్లాండ్ టీమ్ ఇప్పటి వరకూ లీగల్‌గా వన్డే ప్రపంచకప్ గెలవలేదని పరోక్షంగా 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫలితాన్ని తెరపైకి తెచ్చారు. ఆ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టీమ్ స్కోర్లు సూపర్ ఓవర్‌లోనూ సమమవగా.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు నమోదు చేసిన ఇంగ్లాండ్ టీమ్‌ని విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.



రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.