యాప్నగరం

ఆసీస్‌ గడ్డపై జైత్రయాత్ర.. సెలెక్టర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్

ఆసీస్ గడ్డ మీద భారత్ తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న బీసీసీఐ ఆటగాళ్లకు నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సెలెక్టర్లకు కూడా బోర్డు బోనస్ ప్రకటించింది.

Samayam Telugu 22 Jan 2019, 5:35 pm
ఆస్ట్రేలియా పర్యటనను భారత్ విజయవంతంగా ముగించింది. తొలిసారి కంగారూల గడ్డ మీద టెస్టు సిరీస్ నెగ్గడంతోపాటు.. వన్డే సిరీస్‌లోనూ ఆసీస్‌ను కోహ్లిసేన ఓడించింది. చారిత్రాత్మక టెస్టు విజయం తర్వాత ఆటగాళ్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా సెలక్టర్లకు కూడా బోనస్ ప్రకటించింది. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, శరణ్‌దీప్ సింగ్, జితిన్ పరన్జీపే, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీలకు తలో రూ.20 లక్షల చొప్పున బోసన్ అందజేస్తున్నట్టు తెలిపింది.
Samayam Telugu msk with dhoni


టెస్టు, వన్డే సిరీస్‌లను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను టైగా ముగించింది. జట్టు ఎంపికలో సెలక్టర్లు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు విజయంలో కీలక పాత్ర పోషించాయి.

తొలి టెస్టుకు ముందే పృథ్వీ షా గాయపడటంతో.. ఫామ్‌లో లేని రాహుల్, మురళీ విజయ్‌లను సెలెక్టర్లు పక్కనబెట్టారు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఓపెనర్లుగా పంపి ఫలితం రాబట్టారు. మయాంక్ అద్భుతంగా రాణించాడు. జట్టు కూర్పునకు తోడు వ్యూహాలను పక్కాగా అమలు చేయడంతో.. ఆసీస్ గడ్డ మీద టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది.

వన్డేల్లోనూ సెలెక్టర్లు ధోనీకి మద్దతుగా నిలిచారు. గత ఏడాది మహీ దారుణంగా విఫలమైన అతడికి తుది జట్టులో చోటు కల్పించారు. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టిన ధోనీ.. ఆసీస్ గడ్డ మీద తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన భారత జట్టుగా కోహ్లి సేనను నిలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.