యాప్నగరం

పాకిస్థాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టనుందా?

భారత గడ్డ మీద చాన్నాళ్ల తర్వాత దాయాదుల పోరు జరగనుందా. బీసీసీఐ ఇందుకు ఆసక్తిగా చూపుతుండగా.. కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తోంది.

TNN 16 Nov 2017, 12:34 pm
వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధ పడుతోంది. ఆ టోర్నీలో పాకిస్థాన్ జట్టు కూడా పాల్గొనుండటంతో.. ప్రభుత్వ అనుమతి కోరుతూ బీసీసీఐ ఇప్పటికే లేఖ రాసింది. కానీ సర్కారు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లభించలేదు. ఆసియా కప్ ఫార్మాట్, పాల్గొనే జట్లు, షెడ్యూల్‌కు సంబంధించి ఓ నిర్ణయానికి రావడానికి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు నవంబర్ 18న సమావేశం కానున్నారు.
Samayam Telugu bcci awaits government clearance over pakistans inclusion in asia cup
పాకిస్థాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టనుందా?


ఆసియా కప్ కోసం మేం సన్నద్ధం అవుతున్నాం. మిగతాదంతా ప్రభుత్వం చేతిలో ఉందని బీసీసీఐ అధికారి ముంబై మిర్రర్‌కు తెలిపారు. పాకిస్థాన్ ఆడేందుకు వీలుగా అనుమతి కోరుతూ ఇప్పటికే హోం శాఖకు లేఖ రాశామని తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ సంబంధిత అధికారులతో మాట్లాడటం కుదరలేదు. ప్రభుత్వ అధికారులు, క్రీడా మంత్రిత్వ శాఖ త్వరలోనే సస్పెన్స్‌కు తెరదించే అవకాశం ఉంది. పాక్ భారత గడ్డపై ఆడేందుకు కేంద్రం అనుమతిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి సొంత గడ్డ మీదే ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియాకు అవకాశం లభించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.