యాప్నగరం

రిషబ్ పంత్ తప్పిదాలపై గంగూలీ స్పందన

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. నేర్చుకునేందుకు అతనికి మరికొంత సమయం ఇస్తామని స్పష్టం చేశాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

Samayam Telugu 9 Nov 2019, 1:03 pm
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్పిదాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. బంగ్లాదేశ్‌తో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ లిట్టన్ దాస్‌ని స్టంపౌట్ చేసే క్రమంలో తొందరపడిన రిషబ్ పంత్ బంతి వికెట్లని దాటక ముందే అందుకుని తప్పిదం చేశాడు. దీంతో.. ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించగా.. కీపర్ బేసిక్ రూల్‌ని బ్రేక్ చేసిన రిషబ్ పంత్‌పై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
Samayam Telugu Bengaluru: Indian cricketer Rishabh Pant during a practice session ahead of the ...
Rishabh Pant


Read More: కీపింగ్ రూల్.. రిషబ్ పంత్ తప్పిదమేంటి..?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్.. కీపింగ్‌లోనూ తేలిపోతుండటంతో.. సంజు శాంసన్‌కి అవకాశమివ్వండి లేదా ధోనీని మళ్లీ టీ20 జట్టులోకి రప్పించడంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో గెలిచాయి. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ ఆదివారం నాగ్‌పూర్ వేదికగా జరగనుంది.

Read More: సిక్సర్ల వరల్డ్ రికార్డ్ ముంగిట రోహిత్ శర్మ
రిషబ్ పంత్ కీపింగ్ తప్పిదాల గురించి సౌరవ్ గంగూలీ ముందు మీడియా ప్రస్తావించగా.. ‘రిషబ్ పంత్ నెమ్మదిగా పరిణతి చెందుతున్నాడు. అతనికి నేర్చుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో టీమిండియా చాలా బాగా ఆడింది’ అని వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. రిషబ్ పంత్ తప్పిదాలు టీమిండియాలో కంగారు పెంచుతున్నాయి.

IND vs BAN 2nd T20 Trolls: పంత్‌కి జోడీకి మరొక భారత క్రికెటర్.. పేలుతున్న జోక్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.