యాప్నగరం

IND vs PAK మ్యాచ్ జరిగేది అక్కడే: గంగూలీ

ఆసియాక‌ప్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాల‌ను బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ ప‌టాపంచ‌లు చేశాడు. త‌ట‌స్థ వేదిక‌పై జ‌రిగే ఈ టోర్నీలో దాయాది దేశాలు భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డుతాయ‌ని పేర్కొన్నాడు.

Samayam Telugu 28 Feb 2020, 10:47 pm
ఈ ఏడాది జ‌రిగే ఆసియాక‌ప్ టోర్న‌మెంట్‌లో భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతాయ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తెలిపాడు. వ‌చ్చే అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు ముందు ఈ టోర్నీ జ‌రిగే అవ‌కాశ‌ముంది. నిజానికి ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జ‌ర‌గాల్సి ఉండ‌గా.. భ‌ద్ర‌తా కార‌ణాల‌తో ఆ దేశంలో ప‌ర్య‌టించేందుకు భార‌త్ విముఖ‌త వ్య‌క్తం చేసింది. త‌ట‌స్థ వేదిక‌ల‌పై టోర్నీని నిర్వ‌హిస్తే ఆడ‌తామ‌ని సూచించింది. ఈక్ర‌మంలో ఆసియాక‌ప్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌బోతున్నారు.
Samayam Telugu Former Indian cricketer and current BCCI, president Sourav Ganguly reacts during a press conference at the BCCI headquarters in Mumbai
BCCI president Sourav Ganguly


Read Also: రాసిపెట్టుకోండి.. భార‌త ఫ్యూచ‌ర్ స్టార్ అత‌డే!

ఆసియా క్రికెట్ కౌన్సిల్ స‌మావేశానికి బ‌య‌ల్దేరేముందు తాజాగా గంగూలీ కోల్‌క‌తాలో మాట్లాడాడు. ఆసియాక‌ప్ దుబాయ్‌లో జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశాడు. మ‌రోవైపు న్యూజిలాండ్ టూర్‌లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా పడిన టీమిండియా.. పుంజ‌కుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ప‌ర్య‌ట‌న‌లో మరో టెస్టు ఉంద‌ని గుర్తు చేసిన గంగూలీ.. టీమిండియా బౌన్స్ బ్యాక్ అవుతుంద‌ని వ్యాఖ్యానించాడు.

Read Also: పాక్‌లో ఆడబోను.. దేశం కంటే అదే ముఖ్యం!

ఇక ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌కు చేరిన భార‌త మ‌హిళా జ‌ట్టును గంగూలీ అభినందించాడు. అద్భుతమైన ఆట‌తీరుతో భార‌త్‌.. నాకౌట్‌కు చేరింద‌ని, టోర్నీని ఏ స్థానంతో ముగిస్తుందో చూడాల‌ని ఆస‌క్తిగా ఉంద‌ని పేర్కొన్నాడు. మెగాటోర్నీలో మూడు వ‌రుస మ్యాచ్‌ల్లో గెలుపొందిన భార‌త్‌.. సెమీస్‌కు చేరింది. చివ‌రిలీగ్ మ్యాచ్‌ను శ్రీలంక‌తో భార‌త్ ఆడ‌నుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.