యాప్నగరం

ఆసీస్, కివీస్‌లతో సిరీస్‌లు.. షెడ్యూల్

భారత జట్టు సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వేర్వేరుగా వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. మ్యాచ్‌ల షెడ్యూల్..

TNN 8 Sep 2017, 4:55 pm
శ్రీలంకను సొంత గడ్డ మీద 9-0తో వైట్ వాష్ చేసిన భారత క్రికెట్ జట్టు సొంత గడ్డ మీద ఆసీస్, కివీస్ జట్లతో వేర్వేరుగా వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 17 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఆస్ట్రేలియా భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో తలపడనుండగా... న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.
Samayam Telugu bcci confirms dates venues for australia nz series
ఆసీస్, కివీస్‌లతో సిరీస్‌లు.. షెడ్యూల్


సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా ఆసీస్‌తో తొలి వన్డే జరగనుండగా, 21న కోల్‌కతాలో రెండో వన్డే జరగనుంది. మూడో వన్డేకు కటక్‌, నాలుగో వన్డేకు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చివరి వన్డే నాగపూర్‌లో జరగనుంది. రాంచీ, గువహటి, హైదరాబాద్‌లలో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.


న్యూజిలాండ్‌‌తో ముంబై, పుణే, యూపీసీఏల్లో అక్టోబర్ 22, 25, 29 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ, రాజ్‌కోట్, తిరువనంతపురంలు నవంబర్ 1, 4, 7 తేదీల్లో టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అకాడమీ (యూపీసీఏ), తిరువనంతపురం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.