యాప్నగరం

టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషి

టీమిండియాకి కొత్త చీఫ్ సెలక్టర్‌ వచ్చాడు. ఇన్నాళ్లు చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో అతను త్వరలోనే బాధ్యతలు తీసుకోబోతున్నాడు. మొత్తం 44 మంది సెలక్టర్‌ పదవిని ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు.

Samayam Telugu 4 Mar 2020, 5:30 pm
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా మాజీ క్రికెటర్ సునీల్ జోషి నియమితులయ్యాడు. ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియగా.. వారి స్థానాల భర్తీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో.. భారత మాజీ క్రికెటర్ల‌తో సహా మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Samayam Telugu A policeman walks past logo of BCCI in Mumbai


చీఫ్ సెలక్టర్, సెలక్టర్ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. వడపోత అనంతరం ఓ ఐదుగుర్ని మాత్రమే ఇంటర్వ్యూలకి పిలిచింది. ఇందులో సునీల్ జోషి, వెంకటేశ్ ప్రసాద్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్, హర్విందర్ సింగ్ ఉన్నారు. వీరికి ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించిన క్రికెట్ సలహా కమిటీ.. చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషి, సెలక్టర్‌గా హర్విందర్‌ సింగ్‌ పేర్లని బీసీసీకి ప్రతిపాదించింది. సెలక్టర్ల ఎంపిక కోసమే ఇటీవల బీసీసీఐ.. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణలతో కూడిన క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుంచి భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుండగా.. కొత్తగా ఎంపికైనా సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌కి టీమ్‌ని ఎంపిక చేయనుంది. వాస్తవానికి చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కార్ ఎంపికవుతాడనే వార్తలు వచ్చాయి. కానీ.. అనూహ్యంగా అతను కనీసం తుది జాబితాలో కూడా చోటు దక్కించుకోలేపోయాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది. ఈ నేపథ్యంలో కొత్త సెలక్టర్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.