యాప్నగరం

MS Dhoni సెంట్రల్ కాంట్రాక్ట్‌పై మాట్లాడేందుకు గంగూలీ నిరాకరణ

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి మహేంద్రసింగ్ ధోనీని తప్పించి అతడ్ని అవమానించారంటూ ఒకవైపు అభిమానులు మండిపడుతుండగా.. స్పష్టత ఇవ్వాల్సిన గంగూలీ మాట దాటవేశాడు.

Samayam Telugu 18 Jan 2020, 11:56 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంపై మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిరాకరించాడు. టీమిండియాకి ఆడుతున్న 27 మంది క్రికెటర్లకి 2019, అక్టోబరు నుంచి 2020, సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌ని ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. కానీ.. ఆ జాబితాలో ధోనీ పేరు లేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. గత 15 ఏళ్లలో ధోనీ ఇలా కాంట్రాక్ట్‌లో లేకపోవడం ఇదే తొలిసారి.
Samayam Telugu Kolkata: BCCI President-designate Sourav Ganguly being greeted by fans on his ar...


Read More: ధోనీకి ఊహించని షాక్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఔట్

ధోనీకి బీసీసీఐ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి..? అని సౌరవ్ గంగూలీని తాజాగా ప్రశ్నించగా.. అతను సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. ‘నేను ఆ కాంట్రాక్ట్‌పై ఏం చెప్పలేను’ అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల వ్యవధిలోనే ధోనీ భవితవ్యంపై ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించిన గంగూలీ.. కక్షపూరితంగా ధోనీని కాంట్రాక్ట్‌ నుంచి తప్పించినట్లు అతని అభిమానులు ఆరోపిస్తున్నారు.

Read More: ధోనీని పొమ్మనలేక.. పొగబెడుతున్నారా..?

ధోనీ‌కి కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంపై బీసీసీఐ అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. 2019 జులైలో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తర్వాత టీమిండియాకి పూర్తిగా దూరంగా ఉన్నాడు. దీంతో.. ఆరు నెలలు క్రికెట్‌కి దూరంగా ఉన్న క్రికెటర్‌కి కాంట్రాక్ట్ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని స్పష్టం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.