యాప్నగరం

BCCI: పాకిస్థాన్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఎందుకంటే

ఈ ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించబోయే ఆసియాకప్‌లో ఆడటం గురించి బీసీసీఐ స్పష్టతనిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌లో ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

Samayam Telugu 28 Jan 2020, 9:59 pm
పాకిస్థాన్‌లో తమ దేశం పర్యటించి, అక్కడ మ్యాచ్‌లాడే ప్రసక్తే లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా స్పష్టం చేసింది. ఈ ఏడాది పాకిస్థాన్‌లో ఆసియాకప్ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో భద్రతతోపాటు ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఆసియాకప్‌లో ఇండియా ఆడబోదని బోర్డు వర్డాలు తెలిపాయి. నిజానికి పదేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లాంటి జట్లు అక్కడ తాజాగా పర్యటించాయి.
Samayam Telugu BCCI LOGO NEW


Read Also : U-19 వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత్.. 74 రన్స్‌తో ఆసీస్ చిత్తు
మరోవైపు ఆసియాకప్‌లో భారత్ పాల్గొనాలని పాక్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తోంది. ఆసియాకప్‌లో భారత్ ఆడకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమ దేశం పాల్గొనబోదని ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరికలకు దిగింది. అయితే వీటిని భారత బోర్డు ఏమాత్రం ఖాతరు చేయలేదని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

Read Also : IND vs NZ 3rd T20: హామిల్టన్‌లో హోరాహోరీ పోరు తప్పదా.. రికార్డుల విశేషాలు
అయితే ఆసియాకప్‌ను తటస్థ వేదికల్లో నిర్వహిస్తే అందులో పాల్గొంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మాత్రం టోర్నీని నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోమని వ్యాఖ్యానించింది. 2006లో చివరిసారిగా భారత్.. పాకిస్థాన్‌లో పర్యటించి అక్కడ టెస్టు, వన్డే సిరీస్‌లను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Read Also : స్టేజ్‌ ఎక్కడానికి సిగ్గు ప‌డిన ధోనీ.. ఆ మెలిక‌తో సై (వీడియో)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.