యాప్నగరం

ఐపీఎల్ టెండర్‌పై లోధా కమిటీకి బీసీసీఐ లేఖ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల టెండర్‌పై వివరణ కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి అజయ్ షిర్కే.. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీకి ఓ లేఖ రాశారు.

TNN 22 Oct 2016, 3:13 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల టెండర్‌పై వివరణ కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి అజయ్ షిర్కే.. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీకి ఓ లేఖ రాశారు. అక్టోబర్ 25న ఐపీఎల్ మీడియా హక్కులపై ఒక గ్లోబల్ టెండర్ నిర్వహిస్తున్నామని దీనిపై తమకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలని లోధా కమిటీకి రాసిన లేఖలో షిర్కే పేర్కొన్నారు.
Samayam Telugu bcci secretary shirke writes to lodha panel seeks clarifications on ipl rights tender process
ఐపీఎల్ టెండర్‌పై లోధా కమిటీకి బీసీసీఐ లేఖ

లోధా ప్యానెల్ ప్రతిపాదనలన్నీ అమలుచేసేంత వరకు బీసీసీఐ లావాదేవీలన్నీ వెంటనే ఆపేయాలని శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీసీఐ ఒప్పందాలు, టెండర్ల పరిశీలనకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది. ఈ ఒప్పందాల విషయంలో ఒక పరిమితి విధించాలని, దాన్ని మించిన ప్రతి ఒప్పందానికి బీసీసీఐ లోధా కమిటీ అనుమతి పొందాలని చెప్పింది.
ఈ విషయానికి సంబంధించిన వివరణ కోసమే అజయ్ షిర్కే లోధా కమిటీకి లేఖ రాశారు. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం గ్లోబల్ టెండర్‌ను పిలిచామని, అక్టోబర్ 25న ముంబైలో జరిగే ఈ టెండర్ ప్రక్రియలో ప్రముఖ మీడియా కంపెనీలు పాల్గొంటాయని లేఖలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ టెండర్ ప్రక్రియ పరిశీలను ‘డెలాయిట్’ సంస్థను ఆడిటర్‌గా బీసీసీఐ నియమించిందని వెల్లడించారు. ఈ టెండర్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై వివరణ కావాలని లేఖలో కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.