టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అందించిన సేవల్ని గుర్తించి.. అతని జెర్సీ నెం.7కి రిటైర్మెంట్ ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ సూచించాడు. కెప్టెన్గా 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కి అందించిన ధోనీ.. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే.. 2017లో కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోనీ.. 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత అతని జెర్సీ నెం.10కి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్పై ఉన్న గౌరవంతో భవిష్యత్లో ఏ భారత క్రికెటర్కీ ఆ జెర్సీ నెంబరుని కేటాయించబోమని బీసీసీఐ అప్పట్లో చెప్పుకొచ్చింది. తాజాగా మహేంద్రసింగ్ ధోనీకి కూడా అదే తరహా గౌరవం ఇవ్వాలని సబా కరీమ్ చెప్పుకొచ్చాడు. ధోనీ అనే కాదు.. మిగిలిన భారత దిగ్గజ క్రికెటర్ల జెర్సీ నెంబర్లకి కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడు. యువరాజ్ సింగ్ జెర్సీ నెం.12కి రిటైర్మెంట్ ఇవ్వాలని గత రెండేళ్లుగా అభిమానులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
‘‘ధోనీ జెర్సీ నెం.7కి రిటైర్మెంట్ ఇవ్వాలి. ఒక్క ధోనీ అనే కాదు.. భారత దిగ్గజ క్రికెటర్లందరి జెర్సీ నెంబర్ల విషయంలోనూ అదే చేయాలి. ఆ నెంబర్లు ఉన్న జెర్సీని మరేవరూ ధరించకుండా చూడాలి. భారత క్రికెట్కి వాళ్లు చేసిన సేవకి మనమిచ్చే గుర్తింపు, గౌరవం ఇదే’’అని సబా కరీమ్ సూచించాడు.
‘‘ధోనీ జెర్సీ నెం.7కి రిటైర్మెంట్ ఇవ్వాలి. ఒక్క ధోనీ అనే కాదు.. భారత దిగ్గజ క్రికెటర్లందరి జెర్సీ నెంబర్ల విషయంలోనూ అదే చేయాలి. ఆ నెంబర్లు ఉన్న జెర్సీని మరేవరూ ధరించకుండా చూడాలి. భారత క్రికెట్కి వాళ్లు చేసిన సేవకి మనమిచ్చే గుర్తింపు, గౌరవం ఇదే’’అని సబా కరీమ్ సూచించాడు.