యాప్నగరం

వైదొలుగుతానని కుంబ్లేనే చెప్పాడు..!

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కుంబ్లేనే నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ ఛైర్మన్, బీసీసీఐ

TNN 6 Jul 2017, 9:43 pm
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కుంబ్లేనే నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ ఛైర్మన్, బీసీసీఐ సీనియర్ సభ్యుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. తొలుత వెస్టిండీస్ పర్యటన ముగిసే వరకూ కోచ్‌గా కొనసాగాలని కుంబ్లే యోచించినా.. కెప్టెన్ కోహ్లితో విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు రోజులకే కుంబ్లే రాజీనామా చేశాడు. కొత్త కోచ్‌ని శ్రీలంక పర్యటనకి భారత్ జట్టు వెళ్లక ముందే ప్రకటిస్తామని శుక్లా వెల్లడించారు.
Samayam Telugu bcci to select new india coach before sri lanka tour
వైదొలుగుతానని కుంబ్లేనే చెప్పాడు..!


‘ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి వైదొలగాలనేది కుంబ్లే సొంత నిర్ణయం. శ్రీలంక పర్యటనకి భారత్ వెళ్లకముందే.. బీసీసీఐ కొత్త కోచ్‌ ఎంపిక పూర్తి చేస్తుంది’ అని శుక్లా వివరించారు. ప్రస్తుతం కోచ్ రేసులో రవిశాస్త్రి ముందుండగా.. టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే కెప్టెన్ కోహ్లి‌తో పాటు బీసీసీఐ మద్దుతు కూడా రవిశాస్త్రికే ఎక్కువ ఉందనే వార్తలు వస్తున్నాయి. జులై 26 నుంచి శ్రీలంక పర్యటన ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.