యాప్నగరం

బీసీసీఐ జాబితాను తిరస్కరించిన సుప్రీం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త పాలక మండలి నిర్మాణం కోసం నివేదించిన 9 మంది పేర్లను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది.

TNN 24 Jan 2017, 4:04 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త పాలక మండలి నిర్మాణం కోసం నివేదించిన 9 మంది పేర్లను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. 70 ఏళ్లు పైబడిన వారిని పాలక మండలి సభ్యులుగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం భారత్‌లో క్రికెట్‌ను నడిపించే మధ్యంతర ప్యానెల్‌కు సలహాలు ఇవ్వడానికి సీనియర్ లాయర్ కపిల్ సిబల్‌కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
Samayam Telugu bcci v lodha supreme court to reject names over 70 years
బీసీసీఐ జాబితాను తిరస్కరించిన సుప్రీం


బీసీసీఐ కొత్త పాలక మండలి కోసం 9 మంది పేర్లను ఓ సీల్డ్ ఎనవలప్ కవర్లో చాలా రహస్యంగా ధర్మాసనానికి అందజేసారు. ఈ పేర్లను పరిశీలించిన సుప్రీం.. జాబితాలో ఉన్న సభ్యులంతా 70 ఏళ్లు పైబడినవారేనని, దీనికి అనుమతించేది లేదని కోర్టు తేల్చిచెప్పింది. మరోవైపు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కూడా బీసీసీఐ పాలకుల నియామకాన్ని వ్యతిరేకించారు. తీర్పును మరో రెండు వారాలు వాయిదా వేయాలని సుప్రీం కోర్టును ఆయన కోరారు.

జస్టిస్ లోధా కమిటీ సంస్కరణలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను, అబద్ధపు వాగ్దానాలు చేసినందుకు గాను బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌ను సుప్రీం కోర్టు జనవరి 2న తొలగించింది. అలాగే బోర్డులో ఉన్న సభ్యులను, లోధా సంస్కరణలు అమలు చేయని రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లను అనర్హులుగా ప్రకటించింది. బీసీసీఐ కొత్త పాలక మండలిని నియమించడం కోసం కొంతమంది పేర్లను సిఫారుసు చేయాలని బోర్డును సుప్రీం ఆదేశించింది. అయితే వీరిలో బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో 9 ఏళ్లకు మించి పనిచేసినవారు ఉండకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు 9 మంది పేర్లను బీసీసీఐ కోర్టుకు నివేదించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.