యాప్నగరం

టీమిండియాలో మలింగను ధోనీనే గుర్తించాడు..!

భారత జట్టులోకి బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన కేదార్ జాదవ్ అనతికాలంలోనే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తనని ఆల్‌ రౌండర్‌గా

TNN 7 Mar 2018, 12:47 pm
భారత జట్టులోకి బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన కేదార్ జాదవ్ అనతికాలంలోనే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తనని ఆల్‌ రౌండర్‌గా మార్చిన ఘనత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీదేనని కేదార్ జాదవ్ వెల్లడించాడు. శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ తరహాలో బంతులు విసిరే శైలి ఉన్న కేదార్ జాదవ్‌ని అభిమానులు ముద్దుగా ‘టీమిండియా మలింగ’ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే.. జాదవ్‌ వేసేది స్పిన్ బౌలింగ్.
Samayam Telugu became different player after dhoni asked me to bowl in intl cricket jadhav
టీమిండియాలో మలింగను ధోనీనే గుర్తించాడు..!


బెంగళూరు వేదికగా ఈ ఏడాది జనవరి 27, 28న ముగిసిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ. 7.8 కోట్లకి కేదార్ జాదవ్‌ని కొనుగోలు చేసింది. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుండగా.. ధోనీ కెప్టెన్సీ మళ్లీ ఆడబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన కేదార్ జాదవ్.. తాను ఎలా ఆల్‌రౌండర్‌గా మారింది.. మీడియాతో వెల్లడించాడు.

‘భారత్ తరఫున బౌలింగ్ చేసి.. వికెట్లు పడగొడతానని నేను కలలో కూడా ఊహించలేదు. మహేంద్రసింగ్ ధోనీనే నన్ను పిలిచి అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలింగ్ చేయమని కోరేవాడు. ఆటగాడికి ఏ మేరకు స్వేచ్ఛ ఇవ్వాలో..? ఎలాంటి ప్రదర్శన రాబట్టుకోవాలో..? ధోనీకి బాగా తెలుసు. అదే అతనిలో ఉన్న గొప్ప లక్షణం. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో ధోనీ కోరితే ఏ పాత్ర పోషించడానికైనా నేను సిద్ధమే. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ పర్యవేక్షణలో అత్యుత్తమ క్రికెట్ ఆడబోతున్నా’ అని కేదార్ జాదవ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే వేదికగా ఏప్రిల్ 7న జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.