యాప్నగరం

భారత జట్టుకు ధావన్, భువీ దూరం: బీసీసీఐ

తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన భువనేశ్వర్, 94 పరుగులు చేసిన శిఖర్ ధావన్ తర్వాతి మ్యాచ్‌కు దూరం అవుతున్నారు.

TNN 20 Nov 2017, 11:41 pm
కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తీసిన భువనేశ్వర్ కుమార్, రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో టెస్టుకు దూరం అవుతున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా వీరిద్దరూ నాగ్‌పూర్ టెస్టుకు దూరం అవుతున్నారని బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 24 నుంచి 28 తేదీల మధ్య భారత్, శ్రీలంక జట్లు రెండో టెస్టు ఆడనున్నాయి. కాగా నవంబర్ 23న భువీ మీరట్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్‌‌ను పెళ్లాడబోతున్నాడు. దీంతో లంకతో చివరి రెండు టెస్టులకు అతడు దూరం అయ్యాడు. దీంతో భువీ స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు.
Samayam Telugu bhuvneshwar dhawan released from india test squad
భారత జట్టుకు ధావన్, భువీ దూరం: బీసీసీఐ


కానీ రెండో టెస్టులో విజయ్ శంకర్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భువీ స్థానాన్ని ఇషాంత్ శర్మతో భర్తీ చేసే అవకాశం ఉంది. ధావన్ దూరమైనా.. అతడి స్థానంలో మురళీ విజయ్ ఆడే ఛాన్సే ఎక్కువ. శిఖర్ మూడో టెస్టు నాటికి తిరిగి జట్టుతో చేరతాడు. భువీ, ధావన్ ఇద్దరూ వ్యక్తిగత కారణాల రీత్యా రెండో టెస్టు ఆడలేమని రిక్వెస్ట్ చేశారు. దీంతో వారిని రిలీజ్ చేశామని బీసీసీఐ ట్వీట్ చేసింది.

తమిళనాడు వన్డే కెప్టెన్ అయిన విజయ్ శంకర్ 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 1671 పరుగులు చేసి, 27 వికెట్లు పడగొట్టాడు. కొద్ది కాలంగా ఇండియా-ఏ తరఫున ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్య తరహాలోనే సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శంకర్ రాణిస్తాడని బోర్డు ఆశిస్తోంది.

NEWS - Bhuvneshwar Kumar and Shikhar Dhawan released from Indian Test team. Vijay Shankar has been named as Bhuvneshwar Kumar’s replacement in the squad #INDvSL — BCCI (@BCCI) November 20, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.