Big Bash League షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్పై నో క్లారిటీ
ఐపీఎల్ రీషెడ్యూల్పై గత నాలుగు నెలలుగా బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. కానీ.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు వరుసగా తమ ప్రైవేట్ టీ20 లీగ్స్ షెడ్యూల్ని ప్రకటించేశాయి.
Samayam Telugu 15 Jul 2020, 10:15 am
ఆస్ట్రేలియా వేదికగా ఏటా జరిగే బిగ్బాష్ టీ20 లీగ్ షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్కప్ ఆతిథ్యంపై స్పష్టత ఇవ్వలేకపోతున్న సీఏ.. బిగ్బాష్ లీగ్ షెడ్యూల్ని మాత్రం పక్కా క్లారిటీతో ప్రకటించేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 3 నుంచి బిగ్బాష్ లీగ్ ప్రారంభంకానుండగా.. గత ఏడాదితో పోలిస్తే 14 రోజులు ముందే ఈ టోర్నీ ప్రారంభంకాబోతుండటం గమనార్హం.
మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కరోనా వైరస్ నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే..? ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐసీసీ ప్రకటించే ఆ టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయం కోసం గత మూడు నెలలుగా ఎదురుచూస్తోంది. కానీ.. బీసీసీఐని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఐసీసీ మరింత నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోంది.
ఐపీఎల్ షెడ్యూల్పై ఒకవైపు బీసీసీఐ గందరగోళంలో పడిపోగా.. మరోవైపు వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ ప్రైవేట్ టీ20 లీగ్స్ షెడ్యూల్స్ని రోజుల వ్యవధిలోనే ప్రకటించేశాయి. రెండు రోజుల క్రితం విండీస్ బోర్డు తమ దేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించగా.. తాజాగా బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) డిసెంబరు 3 నుంచి స్టార్ట్ అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. దాంతో.. ఈ రెండు టోర్నీలు.. ఐపీఎల్తో క్లాస్ అవకుండా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటిస్తే బీసీసీఐ మరింత ఇరకాటంలో పడుతుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలో కొన్ని పీఎస్ఎల్ మ్యాచ్లు వాయిదాపడిన విషయం తెలిసిందే.
వాస్తవానికి బిగ్బాష్ లీగ్ ప్రారంభమయ్యే రోజే.. భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్కడే టెస్టు సిరీస్ కూడా ప్రారంభంకానుంది. డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ ఈ రెండు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరిగేలా ఇటీవల షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దాంతో.. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో ఆడే స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్తో పాటు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు కూడా కొంత మంది బిగ్బాష్ సీజన్ ఆరంభ మ్యాచ్లకి దూరంగా ఉండనున్నారు.
మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కరోనా వైరస్ నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే..? ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐసీసీ ప్రకటించే ఆ టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయం కోసం గత మూడు నెలలుగా ఎదురుచూస్తోంది. కానీ.. బీసీసీఐని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఐసీసీ మరింత నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోంది.
ఐపీఎల్ షెడ్యూల్పై ఒకవైపు బీసీసీఐ గందరగోళంలో పడిపోగా.. మరోవైపు వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ ప్రైవేట్ టీ20 లీగ్స్ షెడ్యూల్స్ని రోజుల వ్యవధిలోనే ప్రకటించేశాయి. రెండు రోజుల క్రితం విండీస్ బోర్డు తమ దేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించగా.. తాజాగా బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) డిసెంబరు 3 నుంచి స్టార్ట్ అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. దాంతో.. ఈ రెండు టోర్నీలు.. ఐపీఎల్తో క్లాస్ అవకుండా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటిస్తే బీసీసీఐ మరింత ఇరకాటంలో పడుతుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలో కొన్ని పీఎస్ఎల్ మ్యాచ్లు వాయిదాపడిన విషయం తెలిసిందే.
వాస్తవానికి బిగ్బాష్ లీగ్ ప్రారంభమయ్యే రోజే.. భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్కడే టెస్టు సిరీస్ కూడా ప్రారంభంకానుంది. డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ ఈ రెండు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరిగేలా ఇటీవల షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దాంతో.. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో ఆడే స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్తో పాటు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు కూడా కొంత మంది బిగ్బాష్ సీజన్ ఆరంభ మ్యాచ్లకి దూరంగా ఉండనున్నారు.