భారత క్రికెటర్ల ఫిట్నెస్ని మరింత పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నడుం బిగించబోతోంది. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలంటే తప్పనిసరిగా యో-యో ఫిట్నెస్ టెస్టులో ఆటగాడు పాసవ్వాలనే నిబంధనని అమలు చేస్తున్న బీసీసీఐ.. ఈ ఏడాది నుంచి ఆ టెస్టుని మరింత కఠినతరం చేసే దిశగా అడుగులేస్తోంది. 2017లో యో-యో టెస్టుని బీసీసీఐ తెరపైకి తీసుకురాగా.. మొదట్లో అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాతో పాటు కొంత మంది సీనియర్ క్రికెటర్లు ఫెయిలయ్యారు. యువీ కెరీర్ ముగిసిపోవడానికి ఈ యో-యో టెస్టు కూడా ఓ కారణమని అప్పట్లో కొందరు మాజీ క్రికెటర్లు చెప్పుకొచ్చారు.
యో-యో టెస్టు తెరపైకి వచ్చిన తర్వాత భారత క్రికెటర్లకి ఫిట్నెస్పై శ్రద్ధ పెరిగింది. ఎంతలా అంటే.. టీమ్లో సగానికి పైగా ఇప్పుడు ఆటగాళ్లు సిక్స్ప్యాక్తో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ తదితరులు అలవోకగా యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవడమే కాకుండా.. బెంచ్ మార్క్ని సెట్ చేస్తున్నారు. కానీ.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ గత ఏడాది పేలవ ఫిట్నెస్, అధిక బరువుతో విమర్శలు ఎదుర్కొన్నారు. వారితో పాటు కొందరు తరచూ గాయపడుతూ మ్యాచ్లకి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది నుంచి యో-యో ఫిట్నెస్ టెస్టుని మరింత కఠినంగా మార్చాలని బీసీసీఐ యోచిస్తోంది.
యో-యో ఫిట్నెస్ టెస్టులో క్రికెటర్ 17.1 పాయింట్లు సాధిస్తే పాస్గా బీసీసీఐ పరిగణిస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆటగాళ్ల వేగం, సహనానికి పరీక్ష పెట్టేందుకు ఓ టెస్టుని బీసీసీఐ తెరపైకి తీసుకురాబోతోంది. అది ఏంటంటే..? ఫాస్ట్ బౌలర్లు 2 కిమీ దూరాన్ని కేవలం 8 నిమిషాలు 15 సెకన్లలో పూర్తి చేయాలి. బ్యాట్స్మెన్కి మాత్రం 15 సెకన్లు అదనంగా అంటే 8 నిమిషాల 30 సెకన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏడాదిలో మూడు సార్లు ఈ టెస్టుని ఆటగాళ్లని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి, జూన్, సెప్టెంబరు నెలలు ప్రతిపాదనలో ఉండగా.. సెప్టెంబరుకి బదులు ఆగస్టులో నిర్వహించడంపైనా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త ఫిట్నెస్ టెస్టు ప్రతిపాదనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. గాయపడిన ఆటగాడు ఫిట్నెస్ సాధించిన తర్వాత.. మళ్లీ జట్టులోకి వచ్చే ముందు ఈ యో-యో టెస్టులో పాసవడం తప్పనిసరి.
యో-యో టెస్టు తెరపైకి వచ్చిన తర్వాత భారత క్రికెటర్లకి ఫిట్నెస్పై శ్రద్ధ పెరిగింది. ఎంతలా అంటే.. టీమ్లో సగానికి పైగా ఇప్పుడు ఆటగాళ్లు సిక్స్ప్యాక్తో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ తదితరులు అలవోకగా యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవడమే కాకుండా.. బెంచ్ మార్క్ని సెట్ చేస్తున్నారు. కానీ.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ గత ఏడాది పేలవ ఫిట్నెస్, అధిక బరువుతో విమర్శలు ఎదుర్కొన్నారు. వారితో పాటు కొందరు తరచూ గాయపడుతూ మ్యాచ్లకి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది నుంచి యో-యో ఫిట్నెస్ టెస్టుని మరింత కఠినంగా మార్చాలని బీసీసీఐ యోచిస్తోంది.
యో-యో ఫిట్నెస్ టెస్టులో క్రికెటర్ 17.1 పాయింట్లు సాధిస్తే పాస్గా బీసీసీఐ పరిగణిస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆటగాళ్ల వేగం, సహనానికి పరీక్ష పెట్టేందుకు ఓ టెస్టుని బీసీసీఐ తెరపైకి తీసుకురాబోతోంది. అది ఏంటంటే..? ఫాస్ట్ బౌలర్లు 2 కిమీ దూరాన్ని కేవలం 8 నిమిషాలు 15 సెకన్లలో పూర్తి చేయాలి. బ్యాట్స్మెన్కి మాత్రం 15 సెకన్లు అదనంగా అంటే 8 నిమిషాల 30 సెకన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏడాదిలో మూడు సార్లు ఈ టెస్టుని ఆటగాళ్లని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి, జూన్, సెప్టెంబరు నెలలు ప్రతిపాదనలో ఉండగా.. సెప్టెంబరుకి బదులు ఆగస్టులో నిర్వహించడంపైనా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త ఫిట్నెస్ టెస్టు ప్రతిపాదనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. గాయపడిన ఆటగాడు ఫిట్నెస్ సాధించిన తర్వాత.. మళ్లీ జట్టులోకి వచ్చే ముందు ఈ యో-యో టెస్టులో పాసవడం తప్పనిసరి.