యాప్నగరం

ఆసియా కప్‌లో ఫిక్సింగ్ కలకలం

అఫ్గాన్ క్రికెట్ బోర్డు నుంచి సమాచారం అందుకున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) యాంటీ కరప్షన్‌ యూనిట్‌ రంగంలోకి దిగింది.

Samayam Telugu 25 Sep 2018, 4:01 pm
క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జట్టు అఫ్గానిస్థాన్. కానీ ఆ జట్టును సైతం ఫిక్సింగ్‌కు అలవాటు చేయాలని చూడటం ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2018లో కలకలం రేపింది. ఐసీసీ సంబంధిత విభాగం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
Samayam Telugu Mohammad Shahzad


అక్టోబర్ 5 నుంచి 23 వరకు షార్జాలో అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కొందరు బుకీలు అఫ్గాన్ట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షహజాద్‌ను కలిశారు. అఫ్గాన్ ట్వంటీ 20 లీగ్‌లో ఫిక్సింగ్‌ చేయాలని బుకీలు క్రికెటర్‌ను కోరారు. జరిగిన విషయాన్ని కీపర్ షహజాద్‌ అంతే నిజాయితీగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకొచ్చాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు నుంచి సమాచారం అందుకున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) యాంటీ కరప్షన్‌ యూనిట్‌ రంగంలోకి దిగింది.

‘ఆసియా కప్ జరుగుతుండగా కొందరు ఫిక్సింగ్ చేయాలిన కోరుతూ షహజాద్‌ను సంప్రదించారు. అఫ్గాన్ మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పి అలర్ట్ చేశాడు. గత 12 నెలల్లో ఐదుగురు అంతర్జాతీయ జట్ల కెప్టెన్లను బుకీలు కలిశారు. ఇందులో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన నాలుగు దేశాల కెప్టెన్లు ఉన్నారు. గతేడాది నుంచి 32 మంది ఆటగాళ్లను స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో విచారించి, ఎనిమిది మందిపై వేటు వేశామని’ అని ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ అలెక్స్ మార్షల్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.