యాప్నగరం

AUS vs IND: టెస్టు సిరీస్ నుంచి ఇషాంత్ ఔట్.. సన్‌రైజర్స్ పేసర్‌కు జాక్‌పాట్

IShant Sharma | భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 17 నుంచి జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పూర్తిగా దూరమయ్యాడు. మరోవైపు నటరాజన్‌కు బీసీసీఐ వన్డే జట్టులో చోటు కల్పించింది.

Samayam Telugu 27 Nov 2020, 8:20 am
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో గాయపడిన ఇషాంత్.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందుతున్న సంగతి తెలిసిందే. ఇషాంత్ సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలిపిన బీసీసీఐ.. కానీ టెస్టు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని వెల్లడించింది. దీంతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడని తెలిపింది.
Samayam Telugu ishant-nattu


సన్‌రైజర్స్ పేసర్ టి నటరాజన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నవదీప్ సైనీకి బ్యాకప్ ఆప్షన్‌గా నటరాజన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో.. నటరాజన్‌ను బీసీసీఐ టీ20 జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఎన్‌‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. టెస్టు సిరీస్‌లో ఆడేది లేనిది డిసెంబర్ 11న తేలనుంది. ఆ రోజున రోహిత్ ఫిట్‌నెస్‌ను పరీక్షించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.