యాప్నగరం

IND vs AUS: టీమిండియాలోకి జడేజా రీఎంట్రీ.. కేఎల్ రాహుల్ డౌట్

తొలి టెస్టులో అవమానకరీతిలో పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులో కంగారూలకి గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. ఈ మేరకు తుది జట్టులోనూ కనీసం నాలుగు మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 25 Dec 2020, 11:01 am
భారత్ జట్టులోకి సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌‌లో జడేజా ఆడటం లాంఛనంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తొడ కండరాలకి గాయమవగా.. అదే మ్యాచ్ ఇన్నింగ్స్ ఆఖర్లో అతను కాంకషన్‌కి గురయ్యాడు. దాంతో.. ఆ తర్వాత రెండు టీ20లతో పాటు, తొలి టెస్టు మ్యాచ్‌కి కూడా జడేజా దూరంగా ఉండిపోయాడు.
Samayam Telugu Ravindra Jadeja (Image Credit: AFP)


గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాకి తాజాగా టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఈ టెస్టులో జడేజా పాసవడంతో మెల్‌బోర్న్ టెస్టులో అతను ఆడటం లాంఛనంగా కనిపిస్తోంది. ఇక మోచేతి గాయంతో మహ్మద్ షమీ, పితృత్వ సెలవులు తీసుకుని విరాట్ కోహ్లీ సిరీస్‌కి దూరమయ్యారు. దాంతో.. కోహ్లీ స్థానంలో జడేజాని తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి రెండో టెస్టులోనూ ఆడటం ఖాయంగా కనిపిస్తుండగా.. కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో ఛాన్స్ దక్కడంపై సందేహాలు నెలకొన్నాయి.

తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 0, 4 పరుగులతో నిరాశపరిచిన ఓపెనర్ పృథ్వీ షాపై వేటు పడటం లాంఛనంకాగా.. అతని స్థానంలో మరో యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కి అవకాశం దక్కనుంది. అలానే సాహా స్థానంలో రిషబ్ పంత్‌కి చోటివ్వాలని డిమాండ్ వినిపిస్తుండగా.. మహ్మద్ షమీ స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లేదా నవదీప్ సైనీని ఆడించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.