యాప్నగరం

ఐపీఎల్ 2020 వేలంపై రూమర్స్‌కి చెక్..!

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా ఈ నెల 19న ఆ సీజన్‌కి సంబంధించిన ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 332 మంది క్రికెటర్లు ఈ వేలంలో ఉన్నారు.

Samayam Telugu 17 Dec 2019, 3:12 pm
ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలం కోల్‌కతా వేదికగా ఈనెల 19న జరిగేలా దాదాపు నెలన్నర ముందే షెడ్యూల్‌ని రూపొందించారు. కానీ.. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కారణంగా పశ్చిమ బెంగాల్‌లో నిరసలు మిన్నంటాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆటగాళ్ల వేలం వాయిదా వేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ.. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలం జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu IPL 2020 Auction


Read Also: IPL 2020: KKR కెప్టెన్సీ మార్పు..? తెరపైకి కొత్త పేరు
వేలం కోసం మొత్తం 997 మంది క్రికెటర్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకోగా.. ఆటగాళ్ల ప్రమాణాలు ఆధారంగా జాబితాని 332 మందికి కుదించారు. ఇందులో నుంచి టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు కలిపి కేవలం కేవలం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. భారత్ తరఫున రాబిన్ ఉతప్ప రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వస్తుండగా.. యూసఫ్ పఠాన్, పీయూస్ చావ్లా, జయదేవ్ ఉనద్కత్ రూ. కోటితో వేలంలో ఉన్నారు.

Read More: భారత్‌తో వన్డే సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
వేలంలో ఆస్ట్రేలియా హిట్టర్లు మాక్స్‌వెల్, అరోన్ ఫించ్, క్రిస్‌లిన్‌లు భారీ ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇటీవల వేలంలోకి క్రిస్‌లిన్‌ను వదిలేయగా.. అరోన్ ఫించ్ గత ఏడాది ఐపీఎల్‌లో ఆడలేదు. మాక్స్‌వెల్ గత ఏడాదికాలంగా సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇక జయదేవ్ ఉనద్కత్ 2019 సీజన్ వేలంలో రూ. 8.4 కోట్లకి అమ్ముడుపోయాడు. దీంతో.. వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.