యాప్నగరం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలవాలంటే..?

పరిస్థితులకు అనుగుణంగా మ్యాచ్ వ్యూహాలను రచించడంలో అతను దిట్ట. టీమిండియా పేస్ విభాగం

TNN 18 May 2017, 6:51 pm
ఇంగ్లాండ్‌లో జూన్ 1 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవాలంటే.. అక్కడి పరిస్థితులకు బ్యాట్స్‌మెన్ వేగంగా అలవాటు పడాలని టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ సూచించారు. మిగతా జట్లతో పోలిస్తే భారత్ జట్టు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందని.. అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫామ్ కొంత ఆందోళన కలిగిస్తోందని రైట్ వివరించారు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో బరిలోకి దిగనుంది. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ.
Samayam Telugu cc champions trophy 2017 indian batsmen need to adapt to conditions quickly asserts john wright
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలవాలంటే..?


‘అనిల్ కుంబ్లే లాంటి కోచ్ ఉండటం భారత్ జట్టుకు కలిసొచ్చే అంశం. పరిస్థితులకు అనుగుణంగా మ్యాచ్ వ్యూహాలను రచించడంలో అతను దిట్ట. టీమిండియా పేస్ విభాగం ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. కానీ.. టాప్ ఆర్డర్‌పై కుంబ్లే దృష్టి కేంద్రీకరించాలి. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో ఇంగ్లాండ్‌లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిచ్‌లు పేసర్లకి అనుకూలించవచ్చు. అక్కడి పరిస్థితులకి వేగంగా బ్యాట్స్‌మెన్ అలవాటు పడితే భారత్‌దే విజయం’ అని జాన్‌రైట్ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న భారత్ తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో ఢీకొననుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.