యాప్నగరం

ఐసీసీ కొత్త రూల్‌కి చాహల్ ప్రతిపాదన.. సిక్స్ కొడితే బ్యాట్స్‌మెన్ తేవాలి

కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌ రూల్స్‌ని ఐసీసీ మారుస్తుండటంతో.. చాహల్ కామెడీగా స్పందించాడు. సిక్స్ కొడితే బ్యాట్స్‌మెన్ వెళ్లి బంతిని తెచ్చుకునేలా రూల్‌ని తేవాలని సూచించాడు.

Samayam Telugu 28 Apr 2020, 8:39 pm
కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌లోనూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని మార్పులు చేస్తోంది. బంతిపై మెరుపుని కాపాడుకునేందుకు ఇప్పటి వరకూ బౌలర్లు, ఫీల్డర్లు దానిపై ఉమ్ము లేదా చెమటని రాస్తుండగా.. ఇకపై అలా చేయకుండా ఐసీసీ నిబంధనల్ని మారుస్తోంది. బంతిపై ఉమ్ము రాస్తే..? కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న ఐసీసీ.. ఈ మేరకు అభిప్రాయాల్ని కూడా సేకరిస్తోంది. బంతిపై ఉమ్ము లేదా చెమటని రుద్దుతూ మెరుపు కాపాడుకోవడం ద్వారా టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు రివర్స్‌ స్వింగ్ రాబడుతుంటారు.
Samayam Telugu Auckland : Auckland: Indian bowler Yuzvendra Chahal bowls during a One Day Inter...


Read More:సచిన్ లక్ వరల్డ్‌కప్‌లో పాక్‌ కొంపముంచింది: అజ్మల్

ఐసీసీ నిబంధనల మార్పుపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు కొందరు మండిపడుతున్నారు. బంతిపై ఉమ్ము రాయకుండా మెరుపు తెచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతూనే.. ఐసీసీ కొత్త రూల్స్ బ్యాట్స్‌మెన్‌కి మరింత లాభం చేకూర్చనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి వాదనతో అంగీకరించిన టీమిండియా మణికట్టు స్పిన్నర్ చాహల్.. ఫన్నీగా మరో రూల్‌ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు.

Must Read:ఆ తప్పునకి మూడేళ్లు నిషేధమా..?: పాక్ క్రికెటర్ ఫైర్

‘‘బంతిపై ఉమ్ము రుద్ది మెరుగు కాపాడుకోకపోతే.. దాని నుంచి బౌలర్ స్వింగ్ రాబట్టడం చాలా కష్టం. అదే జరిగితే..? బ్యాట్స్‌మెన్‌కి బ్యాటింగ్ సులువు అవుతుంది. ఐసీసీ ఆ రూల్‌తో పాటు మరో రూల్‌ని కూడా ప్రవేశపెట్టాలి. బ్యాట్స్‌మెన్ బంతిని సిక్స్‌గా స్టాండ్స్‌లోకి తరలిస్తే..? అతనే వెళ్లి బంతిని తెచ్చుకోవాలి’’ అని చాహల్ ప్రతిపాదించాడు. కరోనా వైరస్ కారణంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని అందరూ సూచిస్తున్న నేపథ్యంలో.. చాహల్ ఇలా సెటైర్ పేల్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.