యాప్నగరం

కోహ్లీ కెప్టెన్సీపై వినోద్ కాంబ్లి పెదవి విరుపు

చెపాక్ వన్డేలో ఆల్‌రౌండర్లపై అతిగా నమ్మకం ఉంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐదో బౌలర్‌ ఆప్షన్‌ని పక్కన పెట్టాడు. దీంతో.. దూబేని లక్ష్యం చేసుకున్న విండీస్ బ్యాట్స్‌మెన్‌లు హిట్టింగ్‌తో చెలరేగిపోయారు.

Samayam Telugu 16 Dec 2019, 3:33 pm
వెస్టిండీస్‌తో చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. పేలవ బౌలింగ్ కారణంగా వెస్టిండీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో ఐదో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనబడిందని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి వెల్లడించాడు.
Samayam Telugu Hyderabad: Indias Yuzvendra Chahal celebrates after dismissing West Indies bat...


టీమిండియా ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఆల్‌రౌండర్ శివమ్ దూబే, పార్ట్ టైమ్ బౌలర్ కేదార్ జాదవ్‌తో ఆ ఐదో బౌలర్ లేని లోటుని పూడ్చాలని ప్రయత్నించానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ.. మ్యాచ్‌లో ఒకే ఒక ఓవర్‌ బౌలింగ్ చేసిన కేదార్ 11 పరుగులు ఇవ్వగా.. శివమ్ దూబే 7.5 ఓవర్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా తుది జట్టులో జడేజా, దూబే, కేదార్ జాదవ్ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లని విరాట్ కోహ్లీ ఆడించాడు.

‘జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లేకపోవడంతో చెపాక్‌లో టీమిండియా వన్డే జట్టు చాలా భిన్నంగా కనిపించింది. టీమ్‌లో హిట్టర్‌గా శివమ్ దూబే ఉన్నప్పటికీ.. అతడ్ని ఆలస్యంగా 8వ స్థానంలో ఎందుకు బ్యాటింగ్‌కి పంపారో..? నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లను ఎలా కట్టడి చేయాలో..? టీమిండియా మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేయాలి. చెపాక్ వన్డేలో మణికట్టు స్పిన్నర్ చాహల్‌ని ఆడించి ఉంటే బాగుండేది’ అని వినోద్ కాంబ్లి అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.