యాప్నగరం

ఆ విజయం పాక్ ఆటతీరుని మార్చేసింది..!

ఈ నెల 18న హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు విశ్రాంతి లేకుండా తర్వాత రోజే పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది.

Samayam Telugu 9 Sep 2018, 6:55 pm
ఇంగ్లాండ్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని ఓడించడంతో పాకిస్థాన్‌ ఆటతీరు సమూలంగా మారిపోయిందని ఆ దేశ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ అక్కడికి చేరుకోగా.. మీడియాతో ఆదివారం సోహైల్ మాట్లాడాడు. ఈనెల 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. 19న భారత్, పాకిస్థాన్ జట్లు ఢీకొననున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉద్దేశపూర్వకంగానే అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ప్రస్తావనని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Samayam Telugu PakistanCricketTeam_AP


‘ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడంతో పాకిస్థాన్ టీమ్ ఆటతీరే పూర్తిగా మారిపోయింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌‌‌‌ జట్టుని చక్కగా సమన్వయం చేసుకుంటూ నడిపిస్తున్నాడు. అలానే క్రికెటర్లు కూడా కోచ్, సహాయ సిబ్బందికి సహకరిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఎలా ఆడాలో పాక్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా తెలుసుకున్నారు’ అని సోహైల్ వెల్లడించాడు.

ఈ నెల 18న హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు విశ్రాంతి లేకుండా తర్వాత రోజే పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ పెదవి విరిచినా.. ప్రయోజనం లేకపోయింది. 2016లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్.. ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.