యాప్నగరం

కోహ్లికి అలవాటైపోయింది.. మనీష్ కోసం అతణ్ని తప్పిస్తారేమో!: సెహ్వాగ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సెటైర్ వేశాడు. తుది జట్టులో అవసరం లేకున్నా మార్పులు చేయడం విరాట్‌కు అలవాటైందంటూ వీరూ సెటైర్ వేశాడు.

Samayam Telugu 8 Dec 2020, 7:33 am
ఆస్ట్రేలియాతో జరగనున్న నామమాత్రమైన మూడో టీ20లో భారత్ గెలిచినా ఓడినా పోయేదేం లేదు. దీంతో భారత్ తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కానీ మ్యాచ్ మ్యాచ్‌కు జట్టులో మార్పులు చేయడం కోహ్లికి అలవాటు కాబట్టి.. ఈ మ్యాచ్‌లోనూ మార్పులు చేస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన మనీష్ పాండే చివరి టీ20లో ఆడొచ్చనే భావనను వ్యక్తం చేశాడు.
Samayam Telugu virat kohli


రెండు మ్యాచ్‌ల్లో ఆడిన సంజూ శాంసన్ దూకుడుగా కనిపించినప్పటికీ.. పరుగులు చేయలేకపోయాడు. దీంతో మనీష్ ఫిట్‌నెస్ సాధిస్తే శాంసన్ స్థానంలో ఆడే అవకాశం ఉందని వీరూ చెప్పాడు. తొలి టీ20 ఆడిన పాండే.. రెండో టీ20కి దూరం కాగా.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది.

గత మ్యాచ్‌ల్లో సరిగా ఆడలేకపోయిన పాండేకు కోహ్లి మరో అవకాశం ఇస్తాడని వీరూ అంచనా వేశాడు. కానీ బ్యాడ్ లక్.. సంజూ శాంసన్‌కు మాత్రమే ఆడే అవకాశం రాకపోవచ్చన్నాడు. తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనీష్ ఫిట్‌గా ఉంటే.. విరాట్ అతణ్ని ఆడించొచ్చని వీరూ జోస్యం చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.