అప్ఘాన్పై అదరగొట్టిన కొత్త పెళ్లికొడుకు.. లంకను గెలిపించిన అసలంక అసామాన్య పోరాటం!
శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంకకు పెళ్లయ్యాక సుడి తిరిగింది. గత నాలుగు మ్యాచ్ల్లో మెరవలేకపోయిన అసలంక.. అప్ఘానిస్థాన్తో జరిగిన చివరి వన్డేలో మాత్రం అద్భుత ఆటతీరు కనబరిచాడు. అప్ఘాన్తో మూడో వన్డేకు ముందే పెళ్లి చేసుకున్న ఈ క్రికెటర్.. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. 72 బంతుల్లో 83 పరుగులు చేసిన అసలంక.. వెల్లాలగే (21 బంతుల్లో 31)తో కలిసి లంకకు విజయాన్ని అందించాడు.
ప్రధానాంశాలు:
- అప్ఘానిస్థాన్పై మూడో వన్డేలో విజయం సాధించిన శ్రీలంక
- అద్భుత బ్యాటింగ్తో లంకను గెలిపించిన కొత్త పెళ్లి కొడుకు
- ఆఖరి ఓవర్లో గెలిచి సిరీస్ సమం చేసిన లంక
పల్లెకెలే వేదికగా అప్ఘానిస్థాన్తో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. మరో రెండు బంతులు మిగిలి ఉండగా.. 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ముందు బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 138 బంతుల్లో 162 రన్స్ చేయగా.. నజీబుల్లా 76 బంతుల్లో 77 పరుగులతో రాణించాడు. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పతుమ్ నిస్సంక (55 బంతుల్లో 35), కుశాల్ మెండిస్ (61 బంతుల్లో 67) తొలి వికెట్కు 101 పరుగులు జోడించారు. కానీ 15 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన చరిత్ అసలంక (72 బంతుల్లో 83 నాటౌట్) అసామాన్య పోరాటం చేశాడు. ఓవైపు కాలి గాయం వేధిస్తున్నా.. యువ ఆటగాడు వెల్లాలగే (21 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ 10 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో లంక గెలుపు కోసం చివరి వరకూ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
అప్ఘానిస్థాన్తో వన్డే సిరీస్ మధ్యలోనే ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కసున్ రజిత, చరిత్ అసలంక, పతుమ్ నిస్సంక నవంబర్ 28న కొలంబోలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లికి ముందు తన బ్యాటింగ్తో నిరాశపర్చిన అసలంక.. వివాహమయ్యాక మాత్రం చెలరేగాడు. 72 బంతుల్లో 83 పరుగులతో అజేయంగా నిలవడమే కాకుండా.. లక్ష్య చేధనలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
ఈ విజయంతో శ్రీలంక 2023 వన్డే వరల్డ్ కప్కి నేరుగా అర్హత సాధించే అవకాశాలను మెరుగుపర్చుకుంది. అప్ఘానిస్థాన్పై విజయంతో 10 పాయింట్లు వచ్చి చేరడంతో శ్రీలంక ఖాతాలో మొత్తం 77 పాయింట్లు చేరాయి. వరల్డ్ కప్ సూపర్ లీగ్లో శ్రీలంక మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. రెండు విజయాలు సాధిస్తే.. 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ను వెనక్కి నెడుతుంది. కానీ అప్పటికీ శ్రీలంక టాప్-8 నిలవడం కష్టమే. సౌతాఫ్రికా మరో 8 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. ఐదింట్లో గెలిస్తే వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్కి నేరుగా అర్హత సాధిస్తుంది.
Read More Sports News And Telugu News
అప్ఘానిస్థాన్తో వన్డే సిరీస్ మధ్యలోనే ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కసున్ రజిత, చరిత్ అసలంక, పతుమ్ నిస్సంక నవంబర్ 28న కొలంబోలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లికి ముందు తన బ్యాటింగ్తో నిరాశపర్చిన అసలంక.. వివాహమయ్యాక మాత్రం చెలరేగాడు. 72 బంతుల్లో 83 పరుగులతో అజేయంగా నిలవడమే కాకుండా.. లక్ష్య చేధనలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
Read More Sports News And Telugu News