యాప్నగరం

ఐపీఎల్ కోసం బౌలింగ్ మిషన్‌తో ధోనీ ప్రాక్టీస్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. గత ఏడాది జులైలో ఆఖరిగా మ్యాచ్‌లాడిన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

Samayam Telugu 7 Aug 2020, 7:52 pm
ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఆగస్టు 20 తర్వాత యూఏఈకి అన్ని జట్లూ వెళ్లనున్నాయి. అయితే.. యూఏఈకి వెళ్లక ముందే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని భావించిన ధోనీ.. రాంచీలోని స్టేడియానికి వెళ్లి కాసేపు నెట్స్‌లో శ్రమించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu MS Dhoni


ధోనీ ప్రాక్టీస్ సెషన్‌పై ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోషియేషన్ (జేఎస్‌సీఏ) ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ ‘‘అవును.. ధోనీ రాంచీ స్టేడియానికి వచ్చాడు. ఇక్కడ ఇండోర్‌లో అందుబాటులో ఉన్న బౌలింగ్ మిషన్ సాయంతో ధోనీ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు’’ అని వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

2019, జులైలో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పుడు రీఎంట్రీపై కన్నేశాడు. కానీ.. ఏడాదికాలంగా అతను క్రికెట్‌కి దూరంగా ఉండటంతో.. మునుపటి తరహాలో రాణించగలడా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా సగర్వంగా భారత్ జట్టులోకి పునరాగమనం చేయాలని ధోనీ ఆశిస్తున్నాడు. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే.. మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.