యాప్నగరం

ఐపీఎల్‌ ముంగిట CSKకి ఊరట.. 13 మందికీ కరోనా నెగటివ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 13 కరోనా వైరస్ కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2020 సీజన్ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. కానీ.. ఐదు రోజుల వ్యవధిలోనే ఆ 13 మందికీ కరోనా నెగటివ్‌గా తేలింది.

Samayam Telugu 1 Sep 2020, 7:11 pm
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి ఊరటనిచ్చే వార్త. గత శుక్రవారం ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు 11 మంది టీమ్ స్టాఫ్ కరోనా వైరస్ బారినపడగా.. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఈ 13 మందికీ నెగటివ్‌గా వచ్చింది. అయితే.. రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 3న మరోసారి టీమ్‌కి కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ టెస్టులోనూ అందరికీ నెగటివ్ వస్తే..? ఈ నెల 5 నుంచి ట్రైనింగ్‌కి ఆ జట్టుని అనుమతించనున్నారు.
Samayam Telugu Chennai Super Kings
Photo)


చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన గంటల వ్యవధిలోనే ఐపీఎల్ 2020 సీజన్ నుంచి సురేశ్ రైనా తప్పుకుని భారత్‌కి వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతోనే రైనా నిష్క్రమించినట్లు చెన్నై ఫ్రాంఛైజీ చెప్పుకొస్తోంది. కానీ.. రూము విషయమై గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే.. స్పష్టమైన కారణమైతే అధికారికంగా తెలియరావడం లేదు. ఇక టీమ్‌తో కలిసి యూఏఈకి వెళ్లని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కరోనా వైరస్ నేపథ్యంలో.. సురేశ్ రైనా తరహాలో హర్భజన్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. త్వరలోనే ఐపీఎల్‌లో ఆడే అన్ని జట్లనీ బయో- సెక్యూర్ బబుల్‌లోకి బీసీసీఐ చేర్చనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగిలిన ఏడు జట్ల ఆటగాళ్లకి కరోనా నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కసారి ఆటగాళ్లు బయో- సెక్యూర్ బబుల్‌లోకి వెళ్లిన తర్వాత.. వెలుపలి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడానికి వీల్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.