బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న పుజారాకు త్వరలోనే నజరానా దక్కనుంది. ఏడు ఇన్నింగ్స్ల్లో 74.42 సగటుతో 521 రన్స్ చేసిన నయా వాల్కు ప్రమోషన్ రానుంది. మూడు సెంచరీలతో ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన పుజారాను సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఏ+ గ్రేడ్కు ప్రమోట్ చేసే దిశగా బీసీసీఐ యోచిస్తోంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితో భేటీ సమయంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ ఆటగాడిగా ఉన్న పుజారాకు బీసీసీఐకి ఏడాదికి రూ.5 కోట్లు చెల్లిస్తోంది. ఏ+ గ్రేడ్కి మారితే అతడికి రూ.7 కోట్లు దక్కనున్నాయి. ప్రస్తుతం టాప్ కేటగిరీలో కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్తోపాటు బుమ్రా, భువనేశ్వర్ ఉన్నారు.
అన్ని ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ+ కేటగిరీలో చోటు ఇవ్వాలనే నిబంధన ఉండగా.. దాన్ని సడలించడం కుదురుతుందా? అని వినోద్ రాయ్ టీమ్ మేనేజ్మెంట్ను అడగనున్నారట. పుజారాకు ప్రమోషన్ ఇస్తే టెస్టు క్రికెట్ ఆడే యువ ఆటగాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఒకవేళ అన్ని ఫార్మాట్లూ ఆడటం తప్పనిసరి అనే నిబంధన సడలించడం కుదరకపోతే.. ధావన్ టాప్ గ్రేడ్లో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు టెస్టు జట్టులో స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తుండటమే ఇందుకు కారణం.
అన్ని ఫార్మాట్లూ ఆడటం లేదనే కారణంతోనే గత ఏడాది కాంట్రాక్టులు ఇచ్చే సమయంలో ధోనీని ఏ గ్రేడ్కు పరిమితం చేశారు. టెస్టులు ఆడని ధోనీకి ఏ+ గ్రేడ్ అర్హత లేనప్పుడు.. లాంగ్ ఫార్మాట్ మాత్రమే ఆడే పుజారాకు టాప్ కేటగిరీలో చోటు కల్పిస్తే వివాదం తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు.
అన్ని ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ+ కేటగిరీలో చోటు ఇవ్వాలనే నిబంధన ఉండగా.. దాన్ని సడలించడం కుదురుతుందా? అని వినోద్ రాయ్ టీమ్ మేనేజ్మెంట్ను అడగనున్నారట. పుజారాకు ప్రమోషన్ ఇస్తే టెస్టు క్రికెట్ ఆడే యువ ఆటగాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఒకవేళ అన్ని ఫార్మాట్లూ ఆడటం తప్పనిసరి అనే నిబంధన సడలించడం కుదరకపోతే.. ధావన్ టాప్ గ్రేడ్లో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు టెస్టు జట్టులో స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తుండటమే ఇందుకు కారణం.
అన్ని ఫార్మాట్లూ ఆడటం లేదనే కారణంతోనే గత ఏడాది కాంట్రాక్టులు ఇచ్చే సమయంలో ధోనీని ఏ గ్రేడ్కు పరిమితం చేశారు. టెస్టులు ఆడని ధోనీకి ఏ+ గ్రేడ్ అర్హత లేనప్పుడు.. లాంగ్ ఫార్మాట్ మాత్రమే ఆడే పుజారాకు టాప్ కేటగిరీలో చోటు కల్పిస్తే వివాదం తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు.