యాప్నగరం

సెంచరీతో సత్తా చాటిన భారత నయావాల్

టీమిండియా నయావాల్ ఛటేశ్వర్ పుజారా సెంచరీతో కదం తొక్కాడు.

TNN 18 Mar 2017, 2:28 pm
రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌, టీమిండియా నయావాల్ ఛటేశ్వర్ పుజారా సెంచరీతో కదం తొక్కాడు. 93వ ఓవర్‌లో పాల్ కమ్మిన్స్ విసిరిన రెండో బంతిని మిడాఫ్, కవర్స్ మధ్య దిశగా బౌండరీకి తరలించి.. పుజారా.. టెస్టుల్లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్ ఇతడే కావడం విశేషం. అతడు అర్ధ సెంచరీని కూడా బౌండరీతోనే సాధించడం గమనార్హం. విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే తక్కువ స్కోర్లకే ఔటైనా.. భారత ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిని తన భుజాలపై వేసుకొని పుజారా మరోసారి వాల్ పాత్ర పోషిస్తున్నాడు.
Samayam Telugu cheteshwar pujaras 11th century in ranchi test
సెంచరీతో సత్తా చాటిన భారత నయావాల్


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (67), మురళీ విజయ్‌ (82) అర్ధశతకాలతో రాణించి.. ఆసిస్‌కు గట్టిగానే బదులిచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా పుజారా కూడా సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్‌ నిష్క్రమణతో బ్యాటింగ్‌కు దిగిన పుజారా చక్కని క్రికెటింగ్ షాట్లతో అలరిస్తున్నాడు. కోహ్లీ (23 బంతుల్లో 6) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే కూడా తక్కువ స్కోర్‌కే 14 (33 బంతుల్లో, 2×4) ఔటై నిరాశ పరిచాడు. ఆ తర్వాత కరణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.

ప్రస్తుతం టీ విరామ సమయానికి భారత్.. 99 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఛతేశ్వర్‌ పుజారా 109 (232 బంతుల్లో, 15×4), కరుణ్ నాయర్ 13 (21 బంతుల్లో, 2×4) పరుగులతో ఇండియన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోర్‌ను సమం చేయడానికి భారత్.. మరో 148 పరుగులు చేయాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.