శ్రీలంక గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగిస్తోంది. దంబుల్లా వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆల్రౌండర్ ప్రదర్శన కనబర్చిన భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో.. మూడు టీ20ల సిరీస్ని కూడా హర్మన్ప్రీత్ కౌర్ సేన 2-0తో చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచ్ దంబుల్లాలోనే సోమవారం మధ్యాహ్నం జరగనుంది. మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు విస్మి గుణరత్నె (45: 50 బంతుల్లో 6x4), ఆటపట్టు (43: 41 బంతుల్లో 7x4, 1x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. తొలి వికెట్కి 13.5 ఓవర్లలో ఈ ఓపెనింగ్ జోడీ 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. ఆటపట్టుని ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని పూజా వస్త్రాకర్ విడదీయగా.. ఆ తర్వాత దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టింది. దాంతో.. చివరి వరకూ శ్రీలంక కోలుకోలేకపోయింది.
126 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన (39: 34 బంతుల్లో 8x4) దూకుడుగా ఆడేయగా.. మరో ఓపెనర్ షఫాలి వర్మ (17), నెం.3లో వచ్చిన మేఘన (17) మాత్రం తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31 నాటౌట్: 32 బంతుల్లో 2x4) సమయోచితంగా ఆడి భారత్ జట్టుని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 127/5తో గెలిపించింది. కామన్వెల్త్ గేమ్స్ జులై చివర్లో ప్రారంభంకానుండగా.. ఈ గేమ్స్లో ఉమెన్స్ క్రికెట్ కూడా ఉంది. దాంతో.. ఈ గేమ్స్కి ముందు శ్రీలంకపై టీ20 సిరీస్ గెలవడం భారత్ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచేదే!
126 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన (39: 34 బంతుల్లో 8x4) దూకుడుగా ఆడేయగా.. మరో ఓపెనర్ షఫాలి వర్మ (17), నెం.3లో వచ్చిన మేఘన (17) మాత్రం తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31 నాటౌట్: 32 బంతుల్లో 2x4) సమయోచితంగా ఆడి భారత్ జట్టుని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 127/5తో గెలిపించింది. కామన్వెల్త్ గేమ్స్ జులై చివర్లో ప్రారంభంకానుండగా.. ఈ గేమ్స్లో ఉమెన్స్ క్రికెట్ కూడా ఉంది. దాంతో.. ఈ గేమ్స్కి ముందు శ్రీలంకపై టీ20 సిరీస్ గెలవడం భారత్ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచేదే!