యాప్నగరం

భారత జట్టులో స్థానం కోసం పోటీనే మజా..!

దక్షిణాఫ్రికా గడ్డపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ముగిసిన ఆరు వన్డేల

TNN 19 Feb 2018, 8:01 pm
దక్షిణాఫ్రికా గడ్డపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ముగిసిన ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం ముగిసిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20 మ్యాచ్ బుధవారం రాత్రి జరగనున్న నేపథ్యంలో సోమవారం మీడియాతో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడాడు. జట్టులో 4, 5 స్థానాల కోసం శ్రేయాస్‌తో పాటు దినేశ్ కార్తీక్, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, మనీశ్ పాండే పోటీపడుతున్నారు. ఈ పోటీ కారణంగా ఒత్తిడికి గురవుతున్నారా..? అని శ్రేయాస్‌ని మీడియా ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు.
Samayam Telugu competing for middle order slot excites me says shreyas iyer
భారత జట్టులో స్థానం కోసం పోటీనే మజా..!


‘భారత జట్టులో పోటీతో నేనేమీ ఒత్తిడికి గురవడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ఆ పోటీలోని మజానే నాలోని అత్యుత్తమ ఆటని వెలికితీసేలా చేస్తోంది. అవకాశం దక్కితే.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. మ్యాచ్‌కి ముందు ప్రత్యర్థి జట్టు గురించి నేను ఏమీ ఆలోచించను. మెరుగైన ప్రదర్శన చేసేందుకు మాత్రమే ప్రయత్నిస్తా’ అని శ్రేయాస్ వివరించాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో.. చివరి రెండు వన్డేల్లోనూ అవకాశం దక్కించుకున్న శ్రేయాస్.. 18, 30 పరుగులతో నిరాశపరిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.