యాప్నగరం

పాక్‌తో భారత్ క్రికెట్.. కష్టమే: రాజీవ్ శుక్లా

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం జరిగే అవకాశం లేదని ఐపీఎల్ ఛైర్మన్

TNN 25 Dec 2017, 3:02 pm
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం జరిగే అవకాశం లేదని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజాం సేథీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘భారత్‌తో ఆడటం మా హక్కు. టీమిండియాతో ఆడటం వల్ల దాదాపు 150 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం పాక్‌కి వస్తుంది. అంత డబ్బుని అనవసర కారణాలతో విడిచిపెట్టుకోలేం కదా..? అందుకే.. బోర్డుల మధ్య గతంలో కుదర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత్‌ని మ్యాచ్‌లు ఆడాలని కోరుతున్నాం’ అని సేథీ వివరించారు.
Samayam Telugu congress mp rajiv shukla believes current situation not favorable for indo pak ties
పాక్‌తో భారత్ క్రికెట్.. కష్టమే: రాజీవ్ శుక్లా


పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ వ్యాఖ్యలపై రాజీవ్ శుక్లా సోమవారం స్పందించారు. ‘క్రికెటర్ల భద్రత గురించి భారత్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ విషయంలో ఎలాంటి సర్దుబాట్లకి తావులేదు. అందుకే పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు’ అని శుక్లా స్పష్టం చేశారు. ఇటీవల నియంత్రణ రేఖ వద్ద భారత్‌కి చెందిన ఆర్మీ ఆఫీసర్, నలుగురు జవాన్లపై పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.