యాప్నగరం

యువరాజ్ నీకు బుర్ర ఉందా..? అఫ్రిదికి సాయం ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం ఇప్పటి వరకూ యువరాజ్ సింగ్ ఎలాంటి విరాళం ప్రకటించలేదు. మరోవైపు మాజీ, తాజా క్రికెటర్లు తమ స్థాయికి తగినట్లు విరాళాలు అందజేస్తున్నారు. కానీ..యువీ మాత్రం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రిది ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని అభిమానులకి సూచించాడు. దీంతో.. నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా..? అంటూ అభిమానులు చురకలేస్తున్నారు.

Samayam Telugu 31 Mar 2020, 7:27 pm
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ని సోషల్ మీడియాలో అభిమానులు ఉతికారేస్తున్నారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కి చేతనైనంత సాయం చేయాలని పిలుపు ఇవ్వడమే యువరాజ్ సింగ్ తప్పిదమైంది. భారత్‌లో కరోనా కట్టడి కోసం సాయం చేయాల్సిందిపోయి.. శత్రు దేశమైన పాకిస్థాన్‌కి మద్దతుగా నిలుస్తావా..? అంటూ నెటిజన్లు ఉతికారేస్తున్నారు.
Samayam Telugu Kolkata: Former Indian cricketer Yuvraj Singh at a felicitation ceremony for his...



పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది ఫౌండేషన్ కృషి చేస్తుండటంతో ఇటీవల అతడిపై ప్రశంసలు కురిపించిన హర్భజన్ సింగ్.. అన్నింటికంటే మానవత్వం గొప్పదంటా కితాబిచ్చాడు. తాజాగా యువరాజ్ సింగ్ కూడా అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని సూచించాడు. దీంతో.. భారత్ అభిమానులు యువీపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా..? అంటూ చురకలేస్తున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం క్రికెటర్లు రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించగా.. భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ రూ. 3 కోట్లు విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ధోనీ రూ. 1 లక్ష విరాళం ప్రకటించినట్లు వార్తలు వస్తుండగా.. అదీ ఓ ట్రస్ట్‌కి అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో.. రూ. 800 కోట్లు విలువైన ఆస్తులున్న ధోనీ రూ. 1 లక్ష ప్రకటించడంపై విమర్శలు గుప్పించిన అభిమానులు.. ఇప్పుడు యువీ కంటే ధోనీనే నయమని చెప్పుకొస్తున్నారు.





తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.