యాప్నగరం

స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు ఫైనల్‌కి చేరడంలో క్రియాశీలక పాత్ర పోషించిన స్పిన్నర్ పూనమ్ యాదవ్.. తన ఉదారతని చాటుకుంది. దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం తన వంతుగా రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది.

Samayam Telugu 30 Mar 2020, 8:16 pm
కరోనా వైరస్ కట్టడి కోసం భారత మహిళా జట్టు స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన పూనమ్ యాదవ్.. 10 వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టిన పూనమ్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
Samayam Telugu Sydney: Indias Poonam Yadav, right, bowles against Australia during the first ...


Read More: విరాళాలను ప్రశ్నిస్తున్నవారిపై క్రికెటర్ ఫైర్

పూనమ్ యాదవ్ ప్రకటించిన రూ. 2 లక్షల విరాళంలో.. రూ. 1 లక్ష పీఎం- కేర్స్ ఫండ్‌కి కేటాయించగా.. మిగిలిన రూ. 1 లక్ష ఉత్తర్‌ప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్‌కి ఇచ్చింది. వాస్తవానికి ఆదివారమే తన విరాళాన్ని పూనమ్ యాదవ్ ప్రకటించాలని చూసిందట. కానీ.. గూగూల్ పే ద్వారా అంత పెద్ద మొత్తంలో ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో సోమవారం వరకూ వేచి చూసినట్లు ఈ స్పిన్నర్ వెల్లడించింది.

‘‘దేశానికి ఇది చాలా క్లిష్ట సమయం. ఇప్పుడు సమాజానికి ఏదైనా మనం మంచి చేయగలిగే దారి ఏదైనా ఉందంటే..? అది విరాళం అందించడమే. అంతేతప్ప ఇంటి వెలుపలికి మనం వెళ్లలేం.. ఎవరినీ ఇంటికి ఆహ్వానించలేం’’ అని పూనమ్ యాదవ్ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Read More: గ్యాస్ సిలిండర్ పేలి క్రికెటర్ భార్యకి గాయాలు
భారత క్రికెటర్లలో సురేశ్ రైనా రూ. 52 లక్షలు విరాళం ప్రకటించగా.. సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు అందజేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మతో కలిసి విరాళం ప్రకటించాడు. కానీ.. అమౌంట్‌ని మాత్రం రహస్యంగా ఉంచాడు. ధోనీ రూ. 1 లక్ష విరాళం ప్రకటించినట్లు వార్తలు రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కోహ్లీ జాగ్రత్తలు తీసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.