యాప్నగరం

కరోనాతో ఫైట్‌కి ధోనీ సిక్స్ వాడేసిన పోలీసులు

2011 వన్డే ప్రపంచకప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ధోనీ కొట్టిని ఫినిషింగ్ సిక్స్. 28 ఏళ్ల తర్వాత భారత్‌కి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ధోనీ.. కళ్లు చెదిరే సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించాడు.

Samayam Telugu 3 Apr 2020, 10:22 am
భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటి వెలుపలికి వస్తున్న ప్రజల్ని బుజ్జగిస్తూ.. వినని పక్షంలో హెచ్చరిస్తున్న పోలీసులు.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందు ఉన్న అన్ని మార్గాలనీ అనుసరిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు మరో అడుగు ముందుకేసి 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్‌ని కూడా వాడేశారు.
Samayam Telugu MS Dhoni WC 2011 BAT


Read More: నేనే బెస్ట్ కీపర్.. రిటైర్మెంట్‌పై కోప్పడిన ధోని

వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలిచి 9 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో.. అందరూ ఆ వరల్డ్‌కప్ గురించి చర్చిస్తున్నారు. దీంతో.. ముంబయి పోలీసులు ఆ టాఫిక్‌పై ఓ ట్వీట్ చేశారు. ‘‘2011, ఏప్రిల్ 2న భారత్ జట్టు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించే వరకూ మన ఇంట్లోనే కూర్చుని ఉన్నాం. అలానే 2020, ఏప్రిల్ 2న మనం ఇంట్లో కూర్చుని.. భారత్ లక్ష్యాన్ని ఛేదించే సమయం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ముంబయి పోలీసులు ట్వీట్ చేశాడు. అందులోనే.. మ్యాచ్‌ని ధోనీ తన స్టైల్‌లో సిక్స్‌గా ముగించినట్లే.. కరోనా వైరస్‌ వ్యాప్తిని భారత్ తన‌దైన శైలిలో ముగించాలని పోలీసులు సూచించారు.



Read More: ధోనీని పరుగుకి పిలవను.. చూస్తానంతే..!: కోహ్లీ

భారత్‌లో శుక్రవారం ఉదయానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,552కి చేరుకోగా.. ఇందులో 72 మంది ఇప్పటికే చనిపోయారు. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్ 14 వరకూ విధించిన లాక్‌డౌన్‌ని కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.