యాప్నగరం

ఇంట్లోనే ఉండండి.. విరుష్క జోడీ సూచన

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సూచించారు. అలానే తాము కూడా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు వారు వెల్లడించారు.

Samayam Telugu 20 Mar 2020, 3:11 pm
దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ని అరికట్టేందుకు అందరూ ఇంట్లోనే ఉండాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సూచించారు. భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 206కి చేరుకోగా.. వందలాది మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించిన విరుష్క జోడీ.. తామూ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోని కూడా ఈ జంట పోస్ట్ చేసింది.
Samayam Telugu Mumbai: Indian cricketer Virat Kohli and wife Anushka Sharma arrive for the Indi...


Read More: కరోనా వైరస్ ఎఫెక్ట్.. అమ్మాయితో సెల్ఫీకి నో చెప్పిన విరాట్ కోహ్లీ


‘‘కరోనా వైరస్ రూపంలో మనం ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. కాబట్టి.. ఆ వైరస్‌ని అరికట్టేందుకు ఉన్న ఏకైక మార్గం.. వ్యాప్తిని అడ్డుకోవడమే. అందుకే.. ఎవరి ఇళ్లలో వారు ఉద్దాం.. అది అందరికీ సురక్షితం. మేము ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ (స్వీయ నిర్బంధం)లో ఉన్నాం. మీరు కూడా మీ ఇళ్లలో ఉండండి’ అని విరుష్క జోడీ వీడియోలో సూచించింది.

Read More: కోహ్లీ ఫిట్‌నెస్ స్కోరు బ్రేక్.. ఆ ముగ్గురు టాప్
దక్షిణాఫ్రికాతో ఇటీవల జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ని బీసీసీఐ అర్ధాంతరంగా రద్దు చేయగా.. మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ కూడా ఏప్రిల్ 15కి వాయిదా పడింది. మరోవైపు బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు రద్దవడంతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫూకి మద్దతు తెలిపిన విరాట్ కోహ్లీ.. చేతులు శుభ్రం చేసుకోవడంపైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.