యాప్నగరం

వరల్డ్‌కప్‌కి టైముంది కాస్త ఆగండి: రోహిత్ శర్మ

క్రికెట్‌లో వివాదరహితుడిగా పేరొందిన రోహిత్ శర్మ.. అభిమానుల్ని హెచ్చరించడంలో సున్నితంగానే వ్యవహరిస్తుంటాడు. తాజాగా అతను చేసిన ట్వీట్.. అభిమానుల్ని బాధపెట్టేలా కాకుండా.. ఆలోచింపజేసేలా ఉంది.

Samayam Telugu 6 Apr 2020, 2:50 pm
కరోనా వైరస్ కట్టడిలో ఐక్యతని చాటేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకి ఇళ్లలో లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకి అనూహ్య స్పందన లభించింది. కానీ.. కొందరు మాత్రం టపాకాయలు కాలుస్తూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో.. వారికి తనదైన శైలిలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చురకలేశాడు. దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం రోహిత్ శర్మ రూ. 80 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
Samayam Telugu Mt Maunganui: Indias Rohit Sharma during the Twenty/20 cricket international be...


Read More: ధోనీపై మరో వివాదం.. తెరపైకి తెచ్చిన సచిన్

‘‘అందరూ ఇంట్లోనే ఉండండి.. వీధుల్లోకి వెళ్లి సంబరాలు చేసుకోవద్దు. వరల్డ్‌కప్‌కి ఇంకా కొంచెం సమయం ఉంది’’ అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఆ టోర్నీ విజేతగా భారత్ నిలిచిన తర్వాత వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోండి అని పరోక్షంగా రోహత్ శర్మ సూచించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత భారత్‌లో అభిమానుల సంబరాలు మిన్నంటిన విషయం తెలిసిందే.

Read More: బాస్ ఏంటిది..? శ్రేయాస్‌కి ద్రవిడ్ చురకలు


కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. దేశంలో పరిస్థితులు ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. ఇప్పటికే నాలుగు సార్లు ఆ జట్టుని విజేతగా నిలిపాడు. 12 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబయి ఇండియన్స్ మినహా ఏ జట్టు కూడా నాలుగు సార్లు టైటిల్ గెలవలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.