యాప్నగరం

టీ20 వరల్డ్‌కప్ వాయిదా దిశగా ఐసీసీ అడుగులు

ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా ఒక టీ20 ప్రపంచకప్.. ఆ తర్వాత వచ్చే ఏడాది భారత్ వేదికగా మరో టీ20 వరల్డ్‌కప్‌ని నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేసింది. కానీ.. ఇప్పుడు ఆ రెండు టోర్నీలూ ఒక ఏడాది వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 27 Mar 2020, 12:18 pm
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ని వచ్చే ఏడాది‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వాయిదా వేయనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్, పీఎస్‌ఎల్‌తో పాటు చాలా వరకూ క్రికెట్ టోర్నీలు వాయిదా పడగా.. ఇప్పుడు ఆ దెబ్బ ఐసీసీ టోర్నీలపైనా పడనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబరు- నవంబరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది.
Samayam Telugu t20 world cup


Read More: డివిలియర్స్‌ని రోహిత్ శర్మ స్లెడ్జింగ్.. ఫిర్యాదు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యమివ్వడంపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. దీంతో.. పునాలోచనలో పడిన ఐసీసీ.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని చూస్తోంది. అయితే.. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. 2021 టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నాయి. దీంతో.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తే..? అప్పుడు భారత్‌ని ఏమని బుజ్జగించాలో..? ఇప్పుడు ఐసీసీకి పాలుపోవడం లేదు. ఎందుకంటే.. గత మూడేళ్లుగా ఐసీసీ, బీసీసీఐ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.

Read More: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్..?
టీ20 వరల్డ్‌కప్ వాయిదా విషయమై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చిస్తున్న ఐసీసీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలతోనూ చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకి టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కుల్ని ఇస్తే.. ఆ తర్వాత 2022లో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించకోచ్చని ప్రతిపాదించే అవకాశం ఉంది. 2022లో ఎలాంటి ఐసీసీ టోర్నీలు లేవు. మరి ఇప్పటికే ఐపీఎల్ వాయిదా రూపంలో చాలా నష్టపోయిన బీసీసీఐ.. ఐసీసీ ప్రతిపాదనని ఒప్పుకుంటుందా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.