యాప్నగరం

ఐపీఎల్ 2020కి రోడ్ క్లియర్.. టీ20 వరల్డ్‌కప్‌పై చేతులెత్తేసిన ఆస్ట్రేలియా

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపడటం దాదాపు ఖాయమైపోగా.. ఐపీఎల్ 2020 సీజన్‌కి దారులు తెరుచుకున్నాయి. టోర్నీ వాయిదాపై గత రెండు నెలలుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. టీ20 వరల్డ్‌కప్ నిర్వహించడం కష్టమని తేల్చేసింది.

Samayam Telugu 16 Jun 2020, 11:30 am
ఐపీఎల్ 2020 సీజన్‌కి మార్గం సుగుమమైంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌కి తాము ఆతిథ్యమివ్వలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఛైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ పరోక్షంగా వెల్లడించాడు. దాంతో.. టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడం దాదాపు ఖాయమవగా.. ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ జరగడం లాంఛనంకానుంది.
Samayam Telugu IPL, T20 World Cup


వాస్తవానికి మే నెలలోనే టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఐసీసీ నిర్ణయం ప్రకటించబోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై నిషేధం విధించగా.. ఆ దేశంలోకి 16 దేశాల క్రికెట్ జట్లని అనుమతించడం.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్ అసాధ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు తేల్చి చెప్పేశారు. దాంతో.. ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని 2022కి వాయిదా వేయాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ.. తమకి 2021లో భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆఖర్లో మెలిక పెట్టింది. దాంతో.. టోర్నీ వాయిదా నిర్ణయాన్ని ఐసీసీ పక్కన పెట్టింది.

టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్యంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ తాజాగా మాట్లాడుతూ ‘‘టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది అధికారికంగా రద్దు లేదా వాయిదా పడలేదు. అయితే.. టోర్నీలో పోటీపడే 16 దేశాల క్రికెట్ జట్లు ఇక్కడికి రావడంపై ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నాం. కానీ.. వాటిలో కొన్ని దేశాల్లో కరోనా వైరస్ పతాక స్థాయిలో ఉంది. కాబట్టి ఆ దేశాల క్రికెట్ జట్లని దేశంలోకి లేదా టోర్నీలోకి అనుమతించడం అర్థరహితమవుతుంది. నా అంచనా ప్రకారం.. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగడం చాలా చాలా కష్టం’’ అని వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.